ETV Bharat / city

ఎయిడ్స్ బాధితులపై వివక్ష వద్దు: కలెక్టర్ ఇంతియాజ్ - ప్రపంచ ఎయిడ్స్​ దినోత్సవం 2020

ప్రపంచ ఎయిడ్స్​ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ ఇంతియాజ్, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

AIDS Awareness Rally in Vijayawada
ఎయిడ్స్ బాధితులపై వివక్ష వద్దు: కలెక్టర్ ఇంతియాజ్
author img

By

Published : Dec 1, 2020, 12:01 PM IST

Updated : Dec 1, 2020, 1:52 PM IST

ప్రపంచ ఎయిడ్స్​ దినోత్సవం సందర్భంగా విజయవాడలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ ఇంతియాజ్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎయిడ్స్​ బాధితులపై వివక్ష చూపించరాదని... అవగాహనతోనే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటుందని కలెక్టర్ అన్నారు.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 20వేల మంది వరకు ఎయిడ్స్ వ్యాధి బాధితులు ఉన్నారన్నారు. వారికి వైద్య పరంగా అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎయిడ్స్​ రోగులకు పింఛన్ మంజూరు చేస్తోందన్నారు. ఎన్జీఓలు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.


ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని అజిత్​ సింగ్​ నగర్​ పాయికాపురం ఎల్​బీఎస్​ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. పాఠశాల నుంచి స్థానిక పైపుల రోడ్డు కూడలి వరకు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి నాగలింగేశ్వరరావు, జిల్లా సైన్స్​ అధికారి హుస్సేన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రపంచ ఎయిడ్స్​ దినోత్సవం సందర్భంగా విజయవాడలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ ఇంతియాజ్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎయిడ్స్​ బాధితులపై వివక్ష చూపించరాదని... అవగాహనతోనే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటుందని కలెక్టర్ అన్నారు.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 20వేల మంది వరకు ఎయిడ్స్ వ్యాధి బాధితులు ఉన్నారన్నారు. వారికి వైద్య పరంగా అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎయిడ్స్​ రోగులకు పింఛన్ మంజూరు చేస్తోందన్నారు. ఎన్జీఓలు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.


ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని అజిత్​ సింగ్​ నగర్​ పాయికాపురం ఎల్​బీఎస్​ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. పాఠశాల నుంచి స్థానిక పైపుల రోడ్డు కూడలి వరకు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి నాగలింగేశ్వరరావు, జిల్లా సైన్స్​ అధికారి హుస్సేన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రైతు బీమా ప్రీమియంపై రాత్రికి రాత్రే జీవోనా?: అచ్చెన్నాయుడు

Last Updated : Dec 1, 2020, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.