ETV Bharat / city

జనవరి 6 నుంచి ఉప ఎన్నిక ప్రచారం: వైవీ సుబ్బారెడ్డి

author img

By

Published : Dec 27, 2020, 5:31 PM IST

తిరుపతి ఉప ఎన్నికపై చిత్తూరు జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు చర్చించారు. మంత్రులతో పాటు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 6న ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

tirupati by elections
tirupati by elections

చిత్తూరు జిల్లా వైకాపా శాసనసభ్యులు తిరుపతిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో అవలంబిచాల్సిన విధానాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించారు. అనంతరం వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు.

జనవరి 6 నుంచి ఉపఎన్నిక ప్రచారాన్ని ప్రారంభిస్తామన్న ఆయన.. ఎంపీ అభ్యర్థిని సీఎం జగన్ ప్రకటిస్తారన్నారు. సంక్షేమ పథకాలే అజెండాగా ప్రజల్లోకి వెళ్తామని సుబ్బారెడ్డి తెలిపారు.

చిత్తూరు జిల్లా వైకాపా శాసనసభ్యులు తిరుపతిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో అవలంబిచాల్సిన విధానాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించారు. అనంతరం వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు.

జనవరి 6 నుంచి ఉపఎన్నిక ప్రచారాన్ని ప్రారంభిస్తామన్న ఆయన.. ఎంపీ అభ్యర్థిని సీఎం జగన్ ప్రకటిస్తారన్నారు. సంక్షేమ పథకాలే అజెండాగా ప్రజల్లోకి వెళ్తామని సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి

విషాదం: లారీ-ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.