ETV Bharat / city

భక్తులకు భద్రతగా.. అధునాతన సాంకేతిక వ్యవస్థ అండగా..!

నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో... భద్రతకు పెద్దపీట వేస్తోంది తితిదే. సాంకేతికతను అందిపుచ్చుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కొండపైన అణువణువూ పరిశీలించే సీసీ కెమెరాలు, నిరంతరం పర్యవేక్షించే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌... సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాయి. కరోనా క్రమంలో ఈ ఏర్పాట్లు శ్రీవారి భక్తులకు భరోసానిస్తున్నాయి.

author img

By

Published : Jun 21, 2020, 11:47 AM IST

భక్తులకు భద్రతగా.. అధునాతన సాంకేతిక వ్యవస్థ అండగా..!
భక్తులకు భద్రతగా.. అధునాతన సాంకేతిక వ్యవస్థ అండగా..!
తిరుమలలో అధునాతన సాంకేతిక వ్యవస్థ

శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రానికి... దేశ, విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. నిత్యం వేలాది మంది సందర్శించే ప్రాంతం కావడం వల్ల... నిరంతర నిఘా అత్యావశ్యకం. భద్రతకు పెద్దపీట వేస్తున్న తితిదే... ఆక్టోపస్‌ దళం, పోలీసుల సిబ్బందికి తోడు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. తిరుమల కొండను మూడు బోన్లుగా విభజించి... అలయం, మాఢ వీధులు, తిరుమల రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. మొత్తం 17 వందల కెమెరాలు ఉన్న ఈ వ్యవస్థపై... కమాండ్‌ కట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.

ఫేస్​ రికగ్నిషన్​ సాఫ్ట్​వేర్​తో అనుసంధానం

కొండపైనున్న 20 కెమెరాలను ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించారు. పాత నేరస్థులు, దళారులు, హైటెక్ యాచకులను... ఈ కెమెరాలు వెంటనే గుర్తుపట్టేసి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంటాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల వన్యప్రాణులు, జంతువులు రోడ్లపైకి వచ్చినప్పుడు అప్రమత్తం చేసేలా... 'జోన్ ఇంట్రూషన్' సాఫ్ట్‌వేర్‌ కలిగిన 38 కెమెరాలు వినియోగిస్తున్నారు. అలాగే 'వెహికల్ కౌంట్ - నెంబర్ ప్లేట్ ఐడింటిఫికేషన్' సాయంతో... తిరుమలకు ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వెళ్తున్నాయనే వివరాలు తెలుసుకుంటున్నారు. అగ్ని ప్రమాదాల సమాచారం చేరవేసేలా... ఆరు కెమెరాలకు 'ఫైర్ అండ్ స్మోక్ సాఫ్ట్‌వేర్‌' అనుసంధానించారు.

కరోనా నియంత్రణకు ప్రత్యేక సాఫ్ట్​వేర్​

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తితిదే భద్రతా సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లోని 8 కెమెరాలకు 'సోషల్ డిస్టెన్స్ సాఫ్ట్‌వేర్‌'ను జత చేసి పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా భౌతికదూరం నిబంధనలు అతిక్రమిస్తే... సిబ్బందికి సమాచారం చేరవేస్తుందీ సరికొత్త సాఫ్ట్‌వేర్‌. ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఈ విధానాన్ని... పూర్తిస్థాయిలో వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది కూడా... భౌతికదూరం పాటించని వారి సమాచారాన్ని దగ్గర్లోని భద్రతా సిబ్బందికి అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, భద్రతా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నట్లు... తితిదే ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్‌ జెట్టి చెప్పారు.

ఇదీ చూడండి..

అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాం: మంత్రి పెద్దిరెడ్డి

తిరుమలలో అధునాతన సాంకేతిక వ్యవస్థ

శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రానికి... దేశ, విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. నిత్యం వేలాది మంది సందర్శించే ప్రాంతం కావడం వల్ల... నిరంతర నిఘా అత్యావశ్యకం. భద్రతకు పెద్దపీట వేస్తున్న తితిదే... ఆక్టోపస్‌ దళం, పోలీసుల సిబ్బందికి తోడు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. తిరుమల కొండను మూడు బోన్లుగా విభజించి... అలయం, మాఢ వీధులు, తిరుమల రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. మొత్తం 17 వందల కెమెరాలు ఉన్న ఈ వ్యవస్థపై... కమాండ్‌ కట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.

ఫేస్​ రికగ్నిషన్​ సాఫ్ట్​వేర్​తో అనుసంధానం

కొండపైనున్న 20 కెమెరాలను ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించారు. పాత నేరస్థులు, దళారులు, హైటెక్ యాచకులను... ఈ కెమెరాలు వెంటనే గుర్తుపట్టేసి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంటాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల వన్యప్రాణులు, జంతువులు రోడ్లపైకి వచ్చినప్పుడు అప్రమత్తం చేసేలా... 'జోన్ ఇంట్రూషన్' సాఫ్ట్‌వేర్‌ కలిగిన 38 కెమెరాలు వినియోగిస్తున్నారు. అలాగే 'వెహికల్ కౌంట్ - నెంబర్ ప్లేట్ ఐడింటిఫికేషన్' సాయంతో... తిరుమలకు ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వెళ్తున్నాయనే వివరాలు తెలుసుకుంటున్నారు. అగ్ని ప్రమాదాల సమాచారం చేరవేసేలా... ఆరు కెమెరాలకు 'ఫైర్ అండ్ స్మోక్ సాఫ్ట్‌వేర్‌' అనుసంధానించారు.

కరోనా నియంత్రణకు ప్రత్యేక సాఫ్ట్​వేర్​

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తితిదే భద్రతా సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లోని 8 కెమెరాలకు 'సోషల్ డిస్టెన్స్ సాఫ్ట్‌వేర్‌'ను జత చేసి పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా భౌతికదూరం నిబంధనలు అతిక్రమిస్తే... సిబ్బందికి సమాచారం చేరవేస్తుందీ సరికొత్త సాఫ్ట్‌వేర్‌. ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఈ విధానాన్ని... పూర్తిస్థాయిలో వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది కూడా... భౌతికదూరం పాటించని వారి సమాచారాన్ని దగ్గర్లోని భద్రతా సిబ్బందికి అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, భద్రతా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నట్లు... తితిదే ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్‌ జెట్టి చెప్పారు.

ఇదీ చూడండి..

అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాం: మంత్రి పెద్దిరెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.