ETV Bharat / city

కరోనాతో శ్రీవారి ఆదాయం గణనీయంగా తగ్గింది: తితిదే ఈవో

author img

By

Published : Jul 13, 2020, 7:15 PM IST

Updated : Jul 13, 2020, 8:11 PM IST

కరోనా ప్రభావంతో మూడు నెలల పాటు తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేయడం.. తిరిగి ప్రారంభించినా పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనాలకు అనుమతించలేని పరిస్థితుల్లో శ్రీవారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని.. అయినా తితిదేకు నిధుల కొరత లేదని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. సెప్టెంబరులో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు గుత్తేదారుల ఎంపిక కార్యక్రమం చేపట్టినట్లు... అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ttd eo anil kumar singhal about tirumala income
ttd eo anil kumar singhal about tirumala income

కరోనా ప్రభావంతో తిరుమలపై కూడా ఉందని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి టికెట్లు పొందిన భక్తులు తిరుమల యాత్రను రద్దు చేసుకోరని.. కరోనా ప్రభావంతో గడిచిన నెల రోజుల కాలంలో దాదాపు 30 శాతం మంది శ్రీవారి దర్శన టికెట్లు ఉన్నా.. తిరుమలకు రాలేదని ఈవో వివరించారు. హుండీ, తలనీలాలు, వసతి గృహాలు, లడ్డూ ప్రసాద విక్రయాలు ఇలా వివిధ రూపాల్లో శ్రీవారి ఖజానాకు జమ అయ్యే మొత్తం భారీగా తగ్గిపోయిందన్నారు.

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత జూన్ 11 నుంచి జులై 10 వరకు 16.73కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు అనిల్ సింఘాల్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా 1.64 లక్షల మంది భక్తులు, కౌంటర్ల ద్వారా 85,434 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. టికెట్లు బుక్ చేసుకున్న 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని చెప్పారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు టెండర్లు నిర్వహిస్తున్నామనీ....పరిస్థితుల దృష్ట్యా బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెల వరకు తితిదేకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవన్న ఈవో....తలనీలాల విలువ పెరగడంతో 7 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరిందని తెలిపారు. ఇప్పటివరకూ 91 మంది తితిదే ఉద్యోగులకు కరోనా సోకినట్లు స్పష్టం చేసిన ఈవో... అలిపిరి వద్ద 1704, తిరుమలలో 1865 మంది తితిదే ఉద్యోగులకు పరీక్షలు చేసినట్లు వివరించారు. తిరుమలకు వచ్చి పరీక్ష చేయించుకున్న ఏ ఒక్క భక్తుడికీ కరోనా సోకలేదని అన్నారు.

కరోనాతో శ్రీవారి ఆదాయం గణనీయంగా తగ్గింది: తితిదే ఈవో

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి

కరోనా ప్రభావంతో తిరుమలపై కూడా ఉందని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి టికెట్లు పొందిన భక్తులు తిరుమల యాత్రను రద్దు చేసుకోరని.. కరోనా ప్రభావంతో గడిచిన నెల రోజుల కాలంలో దాదాపు 30 శాతం మంది శ్రీవారి దర్శన టికెట్లు ఉన్నా.. తిరుమలకు రాలేదని ఈవో వివరించారు. హుండీ, తలనీలాలు, వసతి గృహాలు, లడ్డూ ప్రసాద విక్రయాలు ఇలా వివిధ రూపాల్లో శ్రీవారి ఖజానాకు జమ అయ్యే మొత్తం భారీగా తగ్గిపోయిందన్నారు.

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత జూన్ 11 నుంచి జులై 10 వరకు 16.73కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు అనిల్ సింఘాల్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా 1.64 లక్షల మంది భక్తులు, కౌంటర్ల ద్వారా 85,434 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. టికెట్లు బుక్ చేసుకున్న 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని చెప్పారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు టెండర్లు నిర్వహిస్తున్నామనీ....పరిస్థితుల దృష్ట్యా బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెల వరకు తితిదేకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవన్న ఈవో....తలనీలాల విలువ పెరగడంతో 7 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరిందని తెలిపారు. ఇప్పటివరకూ 91 మంది తితిదే ఉద్యోగులకు కరోనా సోకినట్లు స్పష్టం చేసిన ఈవో... అలిపిరి వద్ద 1704, తిరుమలలో 1865 మంది తితిదే ఉద్యోగులకు పరీక్షలు చేసినట్లు వివరించారు. తిరుమలకు వచ్చి పరీక్ష చేయించుకున్న ఏ ఒక్క భక్తుడికీ కరోనా సోకలేదని అన్నారు.

కరోనాతో శ్రీవారి ఆదాయం గణనీయంగా తగ్గింది: తితిదే ఈవో

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి

Last Updated : Jul 13, 2020, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.