ETV Bharat / city

వాళ్లు కత్తులు దూస్తే.. పతకాల పంట పండినట్టే - వాళ్లు కత్తులు దూస్తే..పతకాల పంట పండినట్టే

వాళ్లంతా ముద్దు ముద్దు మాటలొలికించే చిన్నారులు.... ఇంకా పసి ప్రాయం ఛాయలు పోని బుజ్జాయిలు. కానీ ఇదంతా చూడటానికే. కత్తి పట్టారా......శరీరాన్ని పాదరసంలా కదిలిస్తారు. ప్రత్యర్థులకు ఆయుధానికున్న పదును చూపిస్తారు. ఆ చిన్నారి బాహుబలులు, రాణి రుద్రమల గురించి మనం తెలుసుకోవాల్సిందే.

వాళ్లు కత్తులు దూస్తే..పతకాల పంట పండినట్టే
author img

By

Published : Aug 5, 2019, 7:29 AM IST

Updated : Aug 5, 2019, 7:45 AM IST

వాళ్లు కత్తులు దూస్తే..పతకాల పంట పండినట్టే

బాహుబలి.. రుద్రమ దేవి వంటి సినిమా పేర్లు వినగానే మదిలో కత్తులు దూయటం, ప్రత్యర్థులతో యుద్ధం చేయటం గుర్తొస్తాయి. అలాంటి కత్తులనే ముద్దు మద్దు మాటలు... బుడి బుడి అడుగులు వేసే చిన్నారులు పట్టేస్తున్నారు. కత్తియుద్ధంలో సత్తా చాటేందుకు సిద్ధమంటున్నారు చిత్తూరు జిల్లా తిరుపతి బుడతలు. కత్తిని తమ చేతికి ఆరో వేలిగా మార్చుకుని ఫెన్సింగ్ (కత్తి యుద్ధం)లో అంచలంచెలుగా ఎదుగుతున్నారు.

కత్తి సాము.. వందళ్ల ఏళ్ల క్రితం నుంచి మన దేశంలో మనుగడలో ఉన్నదే... దాని ఆధునిక రూపమే ఫెన్సింగ్. ఈ క్రీడకు ఆదరణ ప్రస్తుతం అంతంతమాత్రమే. కొంచెం ఖరీదైనది కావటం...పెద్దగా ప్రాచుర్యం లేని కారణంగా చాలా మందికి తెలియదు. ఇలాంటి క్రీడలో చిరుప్రాయంలోనే పతకాల మోత మోగిస్తున్నారు తిరుపతికి చెందిన చిన్నారులు. గత నెల కర్నూలు జిల్లా డోన్​లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌ - 10, అండర్‌ - 12 బాలబాలికల విభాగాల్లో పాల్గొని 9 మంది పతకాలు సాధించారు కత్తివీరులు. ఇప్పుడు జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో.. నేటి నుంచి జరిగే జాతీయస్థాయి పోటీల్లోనూ సత్తా చాటేందుకు... వీరంతా పయనమయ్యారు.

ప్రభుత్వం సహకారం అందించాలి: కోచ్

చిన్న వయస్సులోనే తమని తాము నిరూపించుకోవాలన్న పిల్లల కసితోనే ఈ ఉన్నత ఫలితాలు సాధ్యమయ్యాయని కోచ్ గోపీనాయుడు చెప్పారు. చిన్నారులంతా ఈ క్రీడపట్ల అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారని... ప్రభుత్వం నుంచి కాస్త సహకారమందితే వారిని మరింత సానబెడతానన్నారు.

పతకాల పంట పండిస్తాం..

కోచ్‌ అందించిన శిక్షణ, తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహం... తమను ఎప్పటికప్పడు ఉత్తేజపరుస్తోందని చిన్నారులు చెబుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సైతం పతకాల పంటను పండిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక వసతులు ఏమీ లేకున్నా....కేవలం సాధించాలనే కృషి, పట్టుదలతో ఈ చిన్నారులు సాధించిన విజయాలను నగరవాసులు అభినందిస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలని కోరుతున్నారు.

వాళ్లు కత్తులు దూస్తే..పతకాల పంట పండినట్టే

బాహుబలి.. రుద్రమ దేవి వంటి సినిమా పేర్లు వినగానే మదిలో కత్తులు దూయటం, ప్రత్యర్థులతో యుద్ధం చేయటం గుర్తొస్తాయి. అలాంటి కత్తులనే ముద్దు మద్దు మాటలు... బుడి బుడి అడుగులు వేసే చిన్నారులు పట్టేస్తున్నారు. కత్తియుద్ధంలో సత్తా చాటేందుకు సిద్ధమంటున్నారు చిత్తూరు జిల్లా తిరుపతి బుడతలు. కత్తిని తమ చేతికి ఆరో వేలిగా మార్చుకుని ఫెన్సింగ్ (కత్తి యుద్ధం)లో అంచలంచెలుగా ఎదుగుతున్నారు.

కత్తి సాము.. వందళ్ల ఏళ్ల క్రితం నుంచి మన దేశంలో మనుగడలో ఉన్నదే... దాని ఆధునిక రూపమే ఫెన్సింగ్. ఈ క్రీడకు ఆదరణ ప్రస్తుతం అంతంతమాత్రమే. కొంచెం ఖరీదైనది కావటం...పెద్దగా ప్రాచుర్యం లేని కారణంగా చాలా మందికి తెలియదు. ఇలాంటి క్రీడలో చిరుప్రాయంలోనే పతకాల మోత మోగిస్తున్నారు తిరుపతికి చెందిన చిన్నారులు. గత నెల కర్నూలు జిల్లా డోన్​లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌ - 10, అండర్‌ - 12 బాలబాలికల విభాగాల్లో పాల్గొని 9 మంది పతకాలు సాధించారు కత్తివీరులు. ఇప్పుడు జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో.. నేటి నుంచి జరిగే జాతీయస్థాయి పోటీల్లోనూ సత్తా చాటేందుకు... వీరంతా పయనమయ్యారు.

ప్రభుత్వం సహకారం అందించాలి: కోచ్

చిన్న వయస్సులోనే తమని తాము నిరూపించుకోవాలన్న పిల్లల కసితోనే ఈ ఉన్నత ఫలితాలు సాధ్యమయ్యాయని కోచ్ గోపీనాయుడు చెప్పారు. చిన్నారులంతా ఈ క్రీడపట్ల అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారని... ప్రభుత్వం నుంచి కాస్త సహకారమందితే వారిని మరింత సానబెడతానన్నారు.

పతకాల పంట పండిస్తాం..

కోచ్‌ అందించిన శిక్షణ, తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహం... తమను ఎప్పటికప్పడు ఉత్తేజపరుస్తోందని చిన్నారులు చెబుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సైతం పతకాల పంటను పండిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక వసతులు ఏమీ లేకున్నా....కేవలం సాధించాలనే కృషి, పట్టుదలతో ఈ చిన్నారులు సాధించిన విజయాలను నగరవాసులు అభినందిస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలని కోరుతున్నారు.

Intro:Ap_cdp_46a_04_manchi hiro_kavalannade_lakshyam_Av_Ap10043
k.veerachari, 9948047582
మంచి హీరోగా ఎదగాలన్నది నా జీవిత లక్ష్యం అని సినిమా యువ హీరో అబ్బవరం కిరణ్ తెలిపారు. కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 5న రాజావారి రాణి వారు అనే చిత్రానికి సంబంధించిన మొదటి పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆదివారం రాజంపేటకి చేరుకుంది. కళాశాలలో పాట లాంచింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో కిరణ్ మాట్లాడాడు. ఎక్కడ చదివారు,, ఎలా సినీరంగానికి పరిచయం అయ్యారు.. అనే విషయాలతోపాటు చిత్ర విశేషాలను వివరించారు. వివరాల్లోకి వెళితే.... మాది కడప జిల్లా రాయచోటి. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇదే 2008-12 మధ్యకాలంలో ఇంజనీరింగ్ చదివాను. తర్వాత బెంగళూరులో మంచి ఉద్యోగం వచ్చింది అయినా నా సినీ రంగంపై ఆసక్తితో అటువైపు మొగ్గుచూపాను. కళాశాలలో చదువుతున్నప్పుడు నృత్యం పట్ల ఆసక్తి చూపే వాడిని. ఆ క్రమంలో సినీ రంగంలోకి అడుగు పెట్టాను. 2017 ప్రాంతంలోని మూడు సినిమాలకు అవకాశం వచ్చినా సబ్జెక్టు నచ్చని కారణంగా ఒప్పుకోలేదు. ప్రస్తుతం రాజావారి రాణివారు చిత్రం ద్వారా హీరోగా తెలుగు ప్రజలకు పరిచయం అయినట్లు తెలిపారు. ఈ చిత్రంలోని నాలుగు పాటలను వివిధ ప్రాంతాలలో ఆవిష్కరించాలని భావించాం. ఇందులో భాగంగా తాను చదువుకున్న కళాశాలలో తొలి పాటను ఈనెల 5న ఆవిష్కరించనున్నట్లు వివరించారు. ఈ సినిమా తర్వాత మరో 3 సినిమాలు తీయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో కూడా 2020 లోపు విడుదల అవుతాయని చెప్పుకొచ్చారు ఎన్ని సినిమాలు తీశామన్నదికాదు... అభిమానుల గుండెల్లో నిలిచిపోవాలనే నా లక్ష్యం నా ఆశయమని చెప్పారు. సినీ హీరోయిన్ రహస్య గోరక్ మాట్లాడుతూ తెలుగులో హీరోయిన్గా తొలి సినిమా చేస్తున్నానని, తమిళంలో మరో సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. రాజా వారి రానివారు చిత్రం అన్ని వర్గాల వారికి ఆకట్టుకొనేలా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది.


Body:మంచి హీరో అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం


Conclusion:హీరో కిరణ్
హీరోయిన్ రహస్య గోరక్
Last Updated : Aug 5, 2019, 7:45 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.