ETV Bharat / city

రుయా దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణం: పవన్

author img

By

Published : Apr 26, 2022, 10:31 PM IST

తిరుపతి రుయా ఘటనకు ప్రభుత్వ తీరే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కుమారుడి మృతదేహాన్ని తండ్రి బైకుపై తీసుకెళ్లిన ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా విభాగం పటిష్టంగా లేనందునే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

రుయా దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణం
రుయా దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణం

తిరుపతి రుయా ఘటన అమానవీయమైనదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కుమారుడి మృతదేహాన్ని తండ్రి బైకుపై తీసుకెళ్లిన ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. బాలుడి కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. పరిపాలనా విభాగం పటిష్టంగా లేనందునే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పవన్‌ అన్నారు. ఓ వైద్యుణ్ణి సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు చికిత్స చేయాలా ? అంబులెన్సులు సమకూర్చాలా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలోనూ ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోయారని గుర్తు చేశారు. విద్యుత్ కోతలతో కడప రిమ్స్‌లో రోగుల మరణాలు సంభవించాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలపై మాట్లాడిన వైద్యుడిని వేధించారని అన్నారు. ప్రభుత్వ వేధింపుల వల్ల ఓ డాక్టర్‌ ప్రాణాలు విడిచారని ఆరోపించారు. ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం చూపిస్తోందని పవన్ మండిపడ్డారు.

ఏం జరిగిందంటే..: అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన మామిడితోటలో కూలీగా చేసే వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. ఆ బాలుడు చికిత్స పొందుతుండగానే కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్‌ డ్రైవర్లను అడగ్గా రూ.10వేలు డిమాండ్ చేశారు.

అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు. స్వగ్రామం నుంచి వచ్చిన ఆ అంబులెన్స్‌ డ్రైవర్‌ను రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు కొట్టి తిరిగి వెనక్కి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లానని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై తెదేపా, భాజపా సహా వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. బాలుడి మృతదేహం తీసుకెళ్లకుండా అడ్డుకున్న అంబులెన్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్లు సంఘంగా ఏర్పడి దౌర్జన్యాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

తిరుపతి రుయా ఘటన అమానవీయమైనదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కుమారుడి మృతదేహాన్ని తండ్రి బైకుపై తీసుకెళ్లిన ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. బాలుడి కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. పరిపాలనా విభాగం పటిష్టంగా లేనందునే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పవన్‌ అన్నారు. ఓ వైద్యుణ్ణి సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు చికిత్స చేయాలా ? అంబులెన్సులు సమకూర్చాలా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలోనూ ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోయారని గుర్తు చేశారు. విద్యుత్ కోతలతో కడప రిమ్స్‌లో రోగుల మరణాలు సంభవించాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలపై మాట్లాడిన వైద్యుడిని వేధించారని అన్నారు. ప్రభుత్వ వేధింపుల వల్ల ఓ డాక్టర్‌ ప్రాణాలు విడిచారని ఆరోపించారు. ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం చూపిస్తోందని పవన్ మండిపడ్డారు.

ఏం జరిగిందంటే..: అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన మామిడితోటలో కూలీగా చేసే వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. ఆ బాలుడు చికిత్స పొందుతుండగానే కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్‌ డ్రైవర్లను అడగ్గా రూ.10వేలు డిమాండ్ చేశారు.

అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు. స్వగ్రామం నుంచి వచ్చిన ఆ అంబులెన్స్‌ డ్రైవర్‌ను రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు కొట్టి తిరిగి వెనక్కి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లానని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై తెదేపా, భాజపా సహా వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. బాలుడి మృతదేహం తీసుకెళ్లకుండా అడ్డుకున్న అంబులెన్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్లు సంఘంగా ఏర్పడి దౌర్జన్యాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.