ETV Bharat / city

మహిళను కొట్టారని ఎమ్మార్​పల్లి ఎస్సైపై ఆరోపణలు..వీఆర్​కు పంపిస్తూ ఆదేశాలు

తిరుపతి ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్ ఘటనలో ఎస్ఐని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను బెల్టుతో కొట్టారని ఎస్సై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

author img

By

Published : Dec 7, 2020, 5:57 PM IST

ఎమ్మార్​పల్లి పీఎస్​ ఎస్సైని వీఆర్​కు పంపిస్తూ ఆదేశాలు
ఎమ్మార్​పల్లి పీఎస్​ ఎస్సైని వీఆర్​కు పంపిస్తూ ఆదేశాలు

ఎమ్మార్​పల్లి పోలీస్ స్టేషన్ ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐని వీఆర్​కు పంపిస్తూ తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను ఎస్ఐ బెల్టుతో కొట్టారన్న ఘటన కలకలం రేపగా.. ఇప్పటికే ఈ అంశంపై అదనపు ఎస్పీ సుప్రజ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఎస్ఐని వీఆర్​కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్ధాయి విచారణ అనంతరం తప్పు ఉందని తేలితే శాఖాపరంగా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

ఎమ్మార్​పల్లి పోలీస్ స్టేషన్ ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐని వీఆర్​కు పంపిస్తూ తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను ఎస్ఐ బెల్టుతో కొట్టారన్న ఘటన కలకలం రేపగా.. ఇప్పటికే ఈ అంశంపై అదనపు ఎస్పీ సుప్రజ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఎస్ఐని వీఆర్​కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్ధాయి విచారణ అనంతరం తప్పు ఉందని తేలితే శాఖాపరంగా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'ఏలూరు ఘటనపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.