ETV Bharat / city

తిరుపతి ఐఐటీలో యువ సంబరం.... తీరు విభిన్నం

author img

By

Published : Feb 8, 2020, 11:50 PM IST

యువజనోత్సవాలంటే ఆటపాటలు, క్రీడా పోటీలతో సందడిగా ఉంటుంది. అయితే నవ్యాంధ్రప్రదేశ్​లో ఏకైక అత్యున్నత సాంకేతిక సంస్థ తిరుపతి ఐఐటీలో జరిగే యువజనోత్సవాల తీరే వేరు. ఇక్కడ జరిగే వేడుకలు.. విద్యార్థుల్లో జోష్ నింపుతూనే వారి నైపుణ్యాల ప్రదర్శనకు వేదికగా నిలిచాయి.

cultural fest held in iiit tirupathi in different concept
cultural fest held in iiit tirupathi in different concept
తిరుపతి ఐఐటీలో యువ సంబరం.... తీరు విభిన్నం!

నవ్యాంధ్రప్రదేశ్​లో విభజన హామీల అమలులో భాగంగా ఏర్పాటైన తిరుపతి ఐఐటీ... తొలిసారిగా శాశ్వత క్యాంపస్​లో యువజనోత్సవాలను నిర్వహించుకుంది. ఏర్పేడు సమీపంలో రూపుదిద్దుకున్న శాశ్వత భవనాల్లో జరిగిన ఈ తిరుత్సవ్​లో.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆటపాటలతో పాటు ప్రతిభను వెలికితీసేలా కార్యక్రమాలను నిర్వహించారు.

తిరుత్సవ్​లో కృత్రిమ మేథ, ఆటోమేషన్, ఓఏటీ, రోబోటిక్ టెక్నాలజీ తదితర అంశాలపై జరిగిన సదస్సులు యువత మేధస్సుకు పదునుపెట్టాయి. ప్రత్యేకించి డ్రోన్ల వినియోగంపై అవగాహనను ద్విగుణీకృతం చేసేలా బయానిక్ బర్డ్ తరహా ఆవిష్కరణలు, వాటి ప్రాధాన్యత, వినియోగం తదితర అంశాలపై ఐఐటీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెక్ బైట్ పేరుతో సాగిన సదస్సులో.... భవిష్యత్​లో ఎదురుకానున్న సవాళ్లపై నిపుణులు విద్యార్థులకు సలహాలు, సూచనలు అందచేశారు. తిరుత్సవ్​లో భాగంగా జరిగిన ఆటపోటీలు సైతం ఐఐటీ ప్రత్యేకతను ఘనంగా చాటాయి. క్రైమ్ బస్టర్స్, యాంగ్రీ బర్డ్, ఫంకీ ఫీట్, మిస్ట్రరీ రన్ ఇలా వినూత్న రీతిలో సాగిన ఆటలు, పోటీలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను చాటి చెప్పాయి.

యువజనోత్సవాలంటే కేవలం విద్యార్థుల వేడుకలకే పరిమితం కాకుండా మల్టీ లెర్నింగ్ టాస్కింగ్​లా రూపొందిచవచ్చనే విధంగా తిరుపతి ఐఐటీ తిరుత్సవ్​ను నిర్వహించారు.

ఇదీ చదవండి:

జమ్ముకశ్మీర్​లో శ్రీవారి ఆలయం.. స్థల పరిశీలనకు తితిదే బృందం

తిరుపతి ఐఐటీలో యువ సంబరం.... తీరు విభిన్నం!

నవ్యాంధ్రప్రదేశ్​లో విభజన హామీల అమలులో భాగంగా ఏర్పాటైన తిరుపతి ఐఐటీ... తొలిసారిగా శాశ్వత క్యాంపస్​లో యువజనోత్సవాలను నిర్వహించుకుంది. ఏర్పేడు సమీపంలో రూపుదిద్దుకున్న శాశ్వత భవనాల్లో జరిగిన ఈ తిరుత్సవ్​లో.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆటపాటలతో పాటు ప్రతిభను వెలికితీసేలా కార్యక్రమాలను నిర్వహించారు.

తిరుత్సవ్​లో కృత్రిమ మేథ, ఆటోమేషన్, ఓఏటీ, రోబోటిక్ టెక్నాలజీ తదితర అంశాలపై జరిగిన సదస్సులు యువత మేధస్సుకు పదునుపెట్టాయి. ప్రత్యేకించి డ్రోన్ల వినియోగంపై అవగాహనను ద్విగుణీకృతం చేసేలా బయానిక్ బర్డ్ తరహా ఆవిష్కరణలు, వాటి ప్రాధాన్యత, వినియోగం తదితర అంశాలపై ఐఐటీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెక్ బైట్ పేరుతో సాగిన సదస్సులో.... భవిష్యత్​లో ఎదురుకానున్న సవాళ్లపై నిపుణులు విద్యార్థులకు సలహాలు, సూచనలు అందచేశారు. తిరుత్సవ్​లో భాగంగా జరిగిన ఆటపోటీలు సైతం ఐఐటీ ప్రత్యేకతను ఘనంగా చాటాయి. క్రైమ్ బస్టర్స్, యాంగ్రీ బర్డ్, ఫంకీ ఫీట్, మిస్ట్రరీ రన్ ఇలా వినూత్న రీతిలో సాగిన ఆటలు, పోటీలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను చాటి చెప్పాయి.

యువజనోత్సవాలంటే కేవలం విద్యార్థుల వేడుకలకే పరిమితం కాకుండా మల్టీ లెర్నింగ్ టాస్కింగ్​లా రూపొందిచవచ్చనే విధంగా తిరుపతి ఐఐటీ తిరుత్సవ్​ను నిర్వహించారు.

ఇదీ చదవండి:

జమ్ముకశ్మీర్​లో శ్రీవారి ఆలయం.. స్థల పరిశీలనకు తితిదే బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.