ETV Bharat / city

వ్యాపారులకు 2020 కరోనా నామ సంవత్సరం..!

author img

By

Published : Nov 12, 2020, 5:09 PM IST

ఇప్పటికే దుకాణంలో పేరుకుపోయిన నిల్వలను వేగంగా అమ్ముకోవడంతో పాటు.. దీపావళి సీజన్‌ సొమ్ము చేసుకొనే లక్ష్యంతో ప్రకటించే ఆఫర్లు లేవు.. దంతేరస్‌, ధనత్రయోదశి పర్వదినాన ఆవగింజంతైనా బంగారం కొనాలన్న సెంటిమెంట్లు అంతకంటే లేవు. వెరసి దీపావళి సీజన్‌ పేలని మతాబైంది. ఆఫర్ల మత్తులో మునిగే వినియోగదారుల బలహీనతలను సొమ్ము చేసుకొందామన్న ఆశలు వ్యాపారుల్లో అడుగంటాయి. ఉన్న చోటికే కొనుగోలు చేస్తామన్నా ఆఫర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఉసూరుమంటున్నారు. అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఇద్దరిపైనా కరోనా పెద్దదెబ్బ వేసింది.

వ్యాపారులకు 2020 కరోనా నామ సంవత్సరం..!
వ్యాపారులకు 2020 కరోనా నామ సంవత్సరం..!

దీపావళి వచ్చిదంటే చాలు...ధన త్రయోదశి, దంతేరస్‌ పేరుతో బంగారం మొదలు పలు రకాల వస్తువులను కొనుగోలు చేయడం దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయం. అవసరమైన వాటిని కొనుగోలు చేయకుండా సెంటిమెంట్‌తో దీపావళి పండగ వరకు వేచిచూసి కొనేవారు కొందరైతే... ఆఫర్లు ఆశపెడుతుంటే దుకాణాలకు పరుగులు తీసి కొనేవారు మరికొందరు. పండగ సెంటిమెంట్లు, ఆఫర్ల ఆశలు ఏవీ వినియోగదారున్ని దుకాణాల మెట్ల ఎక్కనీయడం లేదు. ఆశపెట్టే ఆఫర్లను వినియోగదారుల ముందుంచే వ్యాపార ధర్మం దూరమైంది. ఫలితంగా కరోనా నామ సంవత్సరంగా మారిన 2020 సంవత్సర దీపావళి సీజన్‌ వెలవెలపోతోంది.

గత ఏడాదితో పోలిస్తే కొన్ని వ్యాపారాలు పదిశాతానికి పరిమితమవ్వగా...మరికొన్ని చచ్చిచెడి నలభై శాతానికి చేరడమే పెద్ద విజయంగా భావిస్తున్నారు. కొన్ని వ్యాపారాలు అసలే బోనీ కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, గృహోపకరణాల షాపులు ఏవైనా....కరోనా బారిన పడి విలవిలాడుతున్నవే. కరోనా ప్రభావంతో ఎలాంటి ఆఫర్లు లేవు.

ఎలాంటి ఆఫర్లు, స్కీంలు లేకుండా...వినియోగదారులు దుకాణాల వైపు చూడకుండానే ఈ ఏడాది దీపావళి సీజన్‌ నామమాత్రపు వ్యాపారాలతో ముగిసిపోతోంది. దీపావళి సీజన్‌లో రాయలసీమలోని 400 వందల గృహోపకరణాల దుకాణాల్లో ఐదు వందల కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుందన్న అంచనా. కరోనా ప్రభావంతో ఈ ఏడాది గృహోపకరణాల వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. నలభై శాతం మేర కూడా వ్యాపారాలు సాగలేదన్న అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.

దీపావళి వచ్చిదంటే చాలు టపాకాయలు, మిఠాయిల దుకాణాలతో పాటు వస్త్ర దుకాణాలు, బంగారు అభరణాల దుకాణాలు కళకళలాడుతాయి. పండగకు పది రోజులు ముందు నుంచే దుకాణాలకు వరుసకట్టి... ఆఫర్లను వినియోగించుకొంటూ భారీ కొనుగోళ్లు సాగిస్తారు. ఈ ఏడాది వస్త్ర దుకాణాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రాయలసీమ వ్యాప్తంగా మాల్స్‌తో పాటు చిన్న, పెద్ద దుకాణాలు కలిపి నాలుగున్నర వేల వరకు ఉంటాయి. వీటి ద్వారా సగటున సీజన్‌లో ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల పైబడి వ్యాపారం సాగుతుంది. ఈ ఏడాది తమ దుకాణాల్లో పదిశాతం కూడా వ్యాపారం జరగడం లేదని వస్త్ర వ్యాపారులు వాపోతున్నారు. మార్చి లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు ఇటీవల ముగిసిన దసరా సీజన్‌తో కలిపినా సాధారణ రోజుల్లో జరిగే వ్యాపారంలో పదిహేను శాతం కూడా జరగలేదని అభిప్రాయ పడుతున్నారు.

ఆఫర్లు ప్రకటించినా వినియోగదారుల్లో ఎలాంటి ప్రతిస్పందన ఉటుందోనన్న అనుమానంతో కొన్ని సంస్థలు డిస్కౌంట్లు లేకుండా సీజన్ ముగిస్తున్నాయి. పేరుమోసిన సంస్థలే ఆఫర్లు, స్కీం ల జోలికి వెళ్లకపోవడంతో దుకాణాల యజమానులు డిస్కౌంట్లను పూర్తిగా మరచిపోతున్నారు.

ఇదీ చదవండి: సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు

దీపావళి వచ్చిదంటే చాలు...ధన త్రయోదశి, దంతేరస్‌ పేరుతో బంగారం మొదలు పలు రకాల వస్తువులను కొనుగోలు చేయడం దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయం. అవసరమైన వాటిని కొనుగోలు చేయకుండా సెంటిమెంట్‌తో దీపావళి పండగ వరకు వేచిచూసి కొనేవారు కొందరైతే... ఆఫర్లు ఆశపెడుతుంటే దుకాణాలకు పరుగులు తీసి కొనేవారు మరికొందరు. పండగ సెంటిమెంట్లు, ఆఫర్ల ఆశలు ఏవీ వినియోగదారున్ని దుకాణాల మెట్ల ఎక్కనీయడం లేదు. ఆశపెట్టే ఆఫర్లను వినియోగదారుల ముందుంచే వ్యాపార ధర్మం దూరమైంది. ఫలితంగా కరోనా నామ సంవత్సరంగా మారిన 2020 సంవత్సర దీపావళి సీజన్‌ వెలవెలపోతోంది.

గత ఏడాదితో పోలిస్తే కొన్ని వ్యాపారాలు పదిశాతానికి పరిమితమవ్వగా...మరికొన్ని చచ్చిచెడి నలభై శాతానికి చేరడమే పెద్ద విజయంగా భావిస్తున్నారు. కొన్ని వ్యాపారాలు అసలే బోనీ కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, గృహోపకరణాల షాపులు ఏవైనా....కరోనా బారిన పడి విలవిలాడుతున్నవే. కరోనా ప్రభావంతో ఎలాంటి ఆఫర్లు లేవు.

ఎలాంటి ఆఫర్లు, స్కీంలు లేకుండా...వినియోగదారులు దుకాణాల వైపు చూడకుండానే ఈ ఏడాది దీపావళి సీజన్‌ నామమాత్రపు వ్యాపారాలతో ముగిసిపోతోంది. దీపావళి సీజన్‌లో రాయలసీమలోని 400 వందల గృహోపకరణాల దుకాణాల్లో ఐదు వందల కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుందన్న అంచనా. కరోనా ప్రభావంతో ఈ ఏడాది గృహోపకరణాల వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. నలభై శాతం మేర కూడా వ్యాపారాలు సాగలేదన్న అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.

దీపావళి వచ్చిదంటే చాలు టపాకాయలు, మిఠాయిల దుకాణాలతో పాటు వస్త్ర దుకాణాలు, బంగారు అభరణాల దుకాణాలు కళకళలాడుతాయి. పండగకు పది రోజులు ముందు నుంచే దుకాణాలకు వరుసకట్టి... ఆఫర్లను వినియోగించుకొంటూ భారీ కొనుగోళ్లు సాగిస్తారు. ఈ ఏడాది వస్త్ర దుకాణాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రాయలసీమ వ్యాప్తంగా మాల్స్‌తో పాటు చిన్న, పెద్ద దుకాణాలు కలిపి నాలుగున్నర వేల వరకు ఉంటాయి. వీటి ద్వారా సగటున సీజన్‌లో ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల పైబడి వ్యాపారం సాగుతుంది. ఈ ఏడాది తమ దుకాణాల్లో పదిశాతం కూడా వ్యాపారం జరగడం లేదని వస్త్ర వ్యాపారులు వాపోతున్నారు. మార్చి లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు ఇటీవల ముగిసిన దసరా సీజన్‌తో కలిపినా సాధారణ రోజుల్లో జరిగే వ్యాపారంలో పదిహేను శాతం కూడా జరగలేదని అభిప్రాయ పడుతున్నారు.

ఆఫర్లు ప్రకటించినా వినియోగదారుల్లో ఎలాంటి ప్రతిస్పందన ఉటుందోనన్న అనుమానంతో కొన్ని సంస్థలు డిస్కౌంట్లు లేకుండా సీజన్ ముగిస్తున్నాయి. పేరుమోసిన సంస్థలే ఆఫర్లు, స్కీం ల జోలికి వెళ్లకపోవడంతో దుకాణాల యజమానులు డిస్కౌంట్లను పూర్తిగా మరచిపోతున్నారు.

ఇదీ చదవండి: సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.