తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం స్వర్ణోత్సవ విజయ దివస్ వేడుకలు నిర్వహించనున్నారు. అక్కడి ఏర్పాట్లను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు పరిశీలించారు. మిలిటరీ ఆధీనంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ఈ వేదిక వద్దకు సీఎం చేరుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. 1971 సంవత్సరంలో భారత్-పాక్ యుద్ధంలో పోరాడిన తిరుపతికి చెందిన విశ్రాంత సైనికులను ముఖ్యమంత్రి జగన్ సన్మానించనున్నారు.
స్వర్ణోత్సవ విజయ దివస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం జగన్
తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న స్వర్ణోత్సవ విజయ దివస్ ఉత్సవాల ఏర్పాట్లను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం జగన్ హాజరుకానున్నారు.
![స్వర్ణోత్సవ విజయ దివస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం జగన్ CM Jagan will be the chief guest at the Golden Jubilee Vijaya Diwas celebrations in Tirupati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10668107-536-10668107-1613574785662.jpg?imwidth=3840)
తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం స్వర్ణోత్సవ విజయ దివస్ వేడుకలు నిర్వహించనున్నారు. అక్కడి ఏర్పాట్లను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు పరిశీలించారు. మిలిటరీ ఆధీనంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ఈ వేదిక వద్దకు సీఎం చేరుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. 1971 సంవత్సరంలో భారత్-పాక్ యుద్ధంలో పోరాడిన తిరుపతికి చెందిన విశ్రాంత సైనికులను ముఖ్యమంత్రి జగన్ సన్మానించనున్నారు.
ఇదీ చదవండి:
రేపు తిరుపతిలో గోల్డెన్ జూబ్లీ విజయ దివాస్ ఉత్సవాలు