తిరుమలలో గదుల కేటాయింపును తిరుమల తిరుపతి దేవస్థానం మరింత సులభతరం చేసింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. జీఎన్సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, రామ్భగీచ, ఎంబీసీ, సీఆర్వో వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ ద్వారా గదుల సమాచారం వెళ్లనుంది. ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ కేంద్రాలను తితిదే ప్రారంభించనుంది.
ఇదీ చదవండీ...curfew extended: కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. ఆ సమయంలో బయటికొస్తే చర్యలు!