ETV Bharat / city

గోపూజ పేరిట సీఎం జగన్ డ్రామాలు ఆడుతున్నారు : వెంకటరమణారెడ్డి

author img

By

Published : Jan 15, 2021, 10:54 PM IST

తన తప్పులు కప్పిపుచ్చడానికే సీఎం జగన్ గోపూజ డ్రామాలు ఆడుతున్నారని.. తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

anam venkata ramana reddy allegations over cm jagan
సీఎం జగన్​పై విమర్శలు గుప్పించిన ఆనం వెంకట రమణారెడ్డి

జగన్నాథుడికే పంగనామాలు పెట్టగల సమర్థుడు సీఎం జగన్ అని.. తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. హిందువుగా మారినా హైదరాబాద్​లోని ఇంటిపైనున్న క్రైస్తవ మత గుర్తును మార్చలేదన్నారు.

తన తప్పులు తెలియకుండా ఉండేందుకు ఆడుతున్న గోపూజ డ్రామాలు సీఎం జగన్ మానుకోవాలని వెంకటరమణారెడ్డి సూచించారు. ఏకపక్ష ధోరణి మాని, అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. మైనార్టీలను ఉద్ధరిస్తున్నామని చెప్పి.. వారి నిధులకే చిల్లులు పెట్టారని ఆరోపించారు. భక్తులు కానుకలను ఇతర పథకాలకు వాడే హక్కు లేదని పేర్కొన్నారు. ఏ శాఖ నిధులు దానికే వినియోగిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

జగన్నాథుడికే పంగనామాలు పెట్టగల సమర్థుడు సీఎం జగన్ అని.. తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. హిందువుగా మారినా హైదరాబాద్​లోని ఇంటిపైనున్న క్రైస్తవ మత గుర్తును మార్చలేదన్నారు.

తన తప్పులు తెలియకుండా ఉండేందుకు ఆడుతున్న గోపూజ డ్రామాలు సీఎం జగన్ మానుకోవాలని వెంకటరమణారెడ్డి సూచించారు. ఏకపక్ష ధోరణి మాని, అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. మైనార్టీలను ఉద్ధరిస్తున్నామని చెప్పి.. వారి నిధులకే చిల్లులు పెట్టారని ఆరోపించారు. భక్తులు కానుకలను ఇతర పథకాలకు వాడే హక్కు లేదని పేర్కొన్నారు. ఏ శాఖ నిధులు దానికే వినియోగిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

హనుమాన్ జంక్షన్​ వద్ద లారీ బీభత్సం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.