ETV Bharat / city

స్వర్ణాల చెరువు... నిర్లక్ష్యానికి నెలవు

author img

By

Published : Jun 6, 2020, 5:14 PM IST

మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు బారాషాహీద్​ దర్గా రొట్టెల పండుగ. ప్రతీ ఏడాది ఎంతో వేడుకగా జరిగే ఈ పండుగకు స్వర్ణాల చెరువు వేదిక. కోరిన కోర్కె తీరిందనో, కోరిక నెరవేరాలనో మతాలకతీతంగా స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారు. వేల మంది వేడుకగా జరుపుకునే ఈ పండుగ జరిగేదంతా స్వర్ణాల చెరువు చుట్టుపక్కలే. కానీ ఏడాది కాలంగా స్వర్ణాల చెరువు నిర్లక్ష్యానికి గురవుతోంది. పట్టించుకునేవాళ్లు లేక చెత్తచెదారంతో నిండిపోతుంది.

స్వర్ణాల చెరువు... నిర్లక్ష్యానికి నెలవు
స్వర్ణాల చెరువు... నిర్లక్ష్యానికి నెలవు

నెల్లూరు స్వర్ణాల చెరువు చెత్తా చెదారంతో నిండిపోయింది. వ్యర్థాలతో అపరిశుభ్రంగా మారింది. రొట్టెల పండుగ మూడు రోజుల్లో చూపించే శ్రద్ధ తర్వాత ఉండటంలేదని స్థానికులు చెబుతున్నారు. ఏడాది నుంచి స్వర్ణాల చెరువు, చుట్టూ ఉండే పార్కు నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

లాక్​డౌన్​తో రెండు నెలలుగా కనీసం పార్కులోని మొక్కలకు నీరు కూడా పోయడంలేదని స్థానికులు అంటున్నారు. ఒకప్పుడు పచ్చగా ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం వెలవెలబోతుంది. గత ప్రభుత్వ హయాంలో పార్కు సుందరీకరణ పనులు చేశారు. అనంతరం అధికారుల నిర్లక్ష్యంతో పార్కు పశువులకు నివాసంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది.

నెల్లూరు స్వర్ణాల చెరువు చెత్తా చెదారంతో నిండిపోయింది. వ్యర్థాలతో అపరిశుభ్రంగా మారింది. రొట్టెల పండుగ మూడు రోజుల్లో చూపించే శ్రద్ధ తర్వాత ఉండటంలేదని స్థానికులు చెబుతున్నారు. ఏడాది నుంచి స్వర్ణాల చెరువు, చుట్టూ ఉండే పార్కు నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

లాక్​డౌన్​తో రెండు నెలలుగా కనీసం పార్కులోని మొక్కలకు నీరు కూడా పోయడంలేదని స్థానికులు అంటున్నారు. ఒకప్పుడు పచ్చగా ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం వెలవెలబోతుంది. గత ప్రభుత్వ హయాంలో పార్కు సుందరీకరణ పనులు చేశారు. అనంతరం అధికారుల నిర్లక్ష్యంతో పార్కు పశువులకు నివాసంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది.

ఇదీ చదవండి : యువసైన్యం.. అన్నార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.