రైతుల ఉద్యమాన్ని పోలీసు బలంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతుల ఉద్యమం చేస్తున్నారని అన్నారు. రైతులతో కలిసి పోరాడుతున్నందుకే.. చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలతో శాంతియుతంగా నడుస్తున్న ఉద్యమం.. హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేయలేరని స్పష్టం చేశారు. అమరావతిని మరో నందిగ్రామ్గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా? అని ప్రశ్నించారు.
![pawan kalyan on chandrababu police custody](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5644561_janasena.jpg)
ఇదీ చదవండి :