ETV Bharat / city

కార్పొరేట్ ఆస్పత్రుల కక్కుర్తి.. డబ్బులిస్తేనే కరోనా రోగులకు ప్రవేశం

author img

By

Published : Apr 22, 2021, 9:12 PM IST

కరోనాను కార్పొరేట్ ఆస్పత్రులు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఆపత్కాలంలోనూ..మానవత్వం మరచి కాసులు కావాలంటున్నాయి. ఆరోగ్య కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులతో వెళ్తే..పడకలు ఖాళీ లేవంటూ తిప్పి పంపుతున్నాయి. డబ్బు కడితేనే చేర్చుకుంటున్నాయి.

no treatment on cards in guntur private hospitals
కష్టకాలంలోనూ కార్పొరేట్ ఆస్పత్రుల కక్కుర్తి
కష్టకాలంలోనూ కార్పొరేట్ ఆస్పత్రుల కక్కుర్తి

కాసులుంటేనే కరోనా వైద్యం అంటున్నాయి గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు. ఆరోగ్యశ్రీ కార్డులో, ఉద్యోగుల హెల్త్‌కార్డులో చేతబట్టుకుని ఆయాసపడుతూ.. ఆస్పత్రుల గడప తొక్కుతున్న బాధితులను ప్రైవేటు యాజమాన్యాలు చేర్చుకోవటం లేదు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా..ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించింది. 24 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులతోపాటు.. 21 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్యానికి అనుమతి ఇచ్చింది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో.. ప్రభుత్వ ఉద్యోగులు, పేద వర్గాలు ఉచితంగా కరోనాకు చికిత్స తీసుకోవచ్చు. అయితే.. చాలాచోట్ల కార్డులతో వచ్చిన వారిని చేర్చుకోవటం లేదు. ఆస్పత్రి వర్గాలు పడకలు ఖాళీ లేవనే సమాధానం చెప్తున్నాయి. నెట్ వర్క్ ఆసుపత్రుల్లో..కొవిడ్ చికిత్స అందిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బిల్లులు మంజూరవుతాయి. అదే పడకలు కార్డుదారులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే తమ ఇష్టానుసారం వసూలు చేసుకోవచ్చనే ఆశతో ప్రైవేటు యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి.

పెదకాకానికి చెందిన ఓ వ్యవసాయ కూలికి కరోనా సోకగా..గుంటూరు బస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డుపై చేరారు. 3 రోజులపాటు.. కనీసం పట్టించుకోలేదని బంధువులు వాపోయారు. మంగళవారం రాత్రి తీవ్ర ఆయాసంతో శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడిన పరిస్థితుల్లోనే వైద్యం అందించారని ఆరోపించారు. గుంటూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికీ ఇదే అనుభవం ఎదురైంది. డబ్బులు చెల్లించి ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రమే వైద్యం అందిస్తున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.

కొవిడ్‌ వారియర్లుగా చెప్పుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యకార్డులనూ..అనుమతించక పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ సిబ్బంది కోసం...ప్రత్యేకంగా ఓ ఆస్పత్రి కేటాయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చి ఆరోగ్యపరంగా ఇతర సమస్యలున్నవారు,..45ఏళ్లు దాటిన వారు ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆసుపత్రికి వెళ్తున్నారు. కానీ అక్కడ పడకలు లేవంటూ...తిప్పి పంపడంపై ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీచదవండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం..10,759 కేసులు, 31 మరణాలు

కష్టకాలంలోనూ కార్పొరేట్ ఆస్పత్రుల కక్కుర్తి

కాసులుంటేనే కరోనా వైద్యం అంటున్నాయి గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు. ఆరోగ్యశ్రీ కార్డులో, ఉద్యోగుల హెల్త్‌కార్డులో చేతబట్టుకుని ఆయాసపడుతూ.. ఆస్పత్రుల గడప తొక్కుతున్న బాధితులను ప్రైవేటు యాజమాన్యాలు చేర్చుకోవటం లేదు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా..ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించింది. 24 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులతోపాటు.. 21 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్యానికి అనుమతి ఇచ్చింది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో.. ప్రభుత్వ ఉద్యోగులు, పేద వర్గాలు ఉచితంగా కరోనాకు చికిత్స తీసుకోవచ్చు. అయితే.. చాలాచోట్ల కార్డులతో వచ్చిన వారిని చేర్చుకోవటం లేదు. ఆస్పత్రి వర్గాలు పడకలు ఖాళీ లేవనే సమాధానం చెప్తున్నాయి. నెట్ వర్క్ ఆసుపత్రుల్లో..కొవిడ్ చికిత్స అందిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బిల్లులు మంజూరవుతాయి. అదే పడకలు కార్డుదారులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే తమ ఇష్టానుసారం వసూలు చేసుకోవచ్చనే ఆశతో ప్రైవేటు యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి.

పెదకాకానికి చెందిన ఓ వ్యవసాయ కూలికి కరోనా సోకగా..గుంటూరు బస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డుపై చేరారు. 3 రోజులపాటు.. కనీసం పట్టించుకోలేదని బంధువులు వాపోయారు. మంగళవారం రాత్రి తీవ్ర ఆయాసంతో శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడిన పరిస్థితుల్లోనే వైద్యం అందించారని ఆరోపించారు. గుంటూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికీ ఇదే అనుభవం ఎదురైంది. డబ్బులు చెల్లించి ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రమే వైద్యం అందిస్తున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.

కొవిడ్‌ వారియర్లుగా చెప్పుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యకార్డులనూ..అనుమతించక పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ సిబ్బంది కోసం...ప్రత్యేకంగా ఓ ఆస్పత్రి కేటాయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చి ఆరోగ్యపరంగా ఇతర సమస్యలున్నవారు,..45ఏళ్లు దాటిన వారు ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆసుపత్రికి వెళ్తున్నారు. కానీ అక్కడ పడకలు లేవంటూ...తిప్పి పంపడంపై ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీచదవండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం..10,759 కేసులు, 31 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.