ETV Bharat / city

తెదేపా హయాంలో చేసిన అప్పులన్నీ వైకాపానే చెల్లించింది: ఎంపీ మోపిదేవి

author img

By

Published : Mar 12, 2022, 5:58 PM IST

MP Mopidevi Venkata Ramana Rao: తెదేపా సర్కారు హయాంలో చేసిన అప్పులన్నీ వైకాపా ప్రభుత్వమే చెల్లించిందని ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. ఏ ప్రభుత్వం అయినా అప్పులు తీసుకోవడం.. తిరిగి చెల్లించడం సర్వసాధారణం అని అన్నారు. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి బడ్జెట్​లో వేల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు.

MP Mopidevi Venkata Ramana Rao
ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు

MP Mopidevi Venkata Ramana Rao: తెదేపా హయాంలో చేసిన అప్పులన్నీ... వైకాపా వచ్చాకే చెల్లించిందని ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం అప్పుల పాలైందని ప్రతిపక్ష నేతలు విమర్శించడం సరికాదని మండిపడ్డారు.

ఏ ప్రభుత్వం అయినా అప్పులు తీసుకోవడం.. తిరిగి చెల్లించడం సర్వసాధారణం అని చెప్పారు. బడ్జెట్​లో రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులూ లేవని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం దారుణమని మండిపడ్డారు.

MP Mopidevi Venkata Ramana Rao: అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి బడ్జెట్​లో వేల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. అభివృద్ధి పనులు ఆగిపోకుండా.. కాంట్రాక్టర్లకు బకాయిల చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు.

కార్పొరేషన్ నిధులు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు నూతన జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి: Death Toll: జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన నాటుసారా మరణాలు!

MP Mopidevi Venkata Ramana Rao: తెదేపా హయాంలో చేసిన అప్పులన్నీ... వైకాపా వచ్చాకే చెల్లించిందని ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం అప్పుల పాలైందని ప్రతిపక్ష నేతలు విమర్శించడం సరికాదని మండిపడ్డారు.

ఏ ప్రభుత్వం అయినా అప్పులు తీసుకోవడం.. తిరిగి చెల్లించడం సర్వసాధారణం అని చెప్పారు. బడ్జెట్​లో రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులూ లేవని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం దారుణమని మండిపడ్డారు.

MP Mopidevi Venkata Ramana Rao: అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి బడ్జెట్​లో వేల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. అభివృద్ధి పనులు ఆగిపోకుండా.. కాంట్రాక్టర్లకు బకాయిల చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు.

కార్పొరేషన్ నిధులు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు నూతన జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి: Death Toll: జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన నాటుసారా మరణాలు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.