ETV Bharat / city

'తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే.. విచారణలో నిరూపించుకోవాలి'

author img

By

Published : Mar 17, 2021, 5:36 PM IST

మాజీ సీఎం చంద్రబాబుకు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీఐడీ విచారణకు హాజరై తన సత్యశీలతను నిరూపించుకోవాలని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తెదేపా నేతలు దళితలను మోసగించారని ఆమె పేర్కొన్నారు.

mla sridevi comments on chandrababu
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే సీఐడీ నోటీసులు ఇచ్చారని.. దానిని తెదేపా నేతలు భూతద్దంలో చూపించి గగ్గోలు పెట్టడం సరికాదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తప్పు చేయలేదనే నమ్మకం బాబుకు ఉంటే సీఐడీ విచారణకు హాజరై తన సత్యశీలతను నిరూపించుకోవాలన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఎస్సీల భూములను తెదేపా నేతలు అన్యాక్రాంతం చేశారని... ఈ స్కాంలో చంద్రబాబు డైరెక్టర్ అయితే.. లోకేష్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారని విమర్శించారు.

రాష్ట్ర ప్రజలంతా రాజధాని వికేంద్రీకరణ కోరుతున్నారని... దానికి మున్సిపల్ ఫలితాలే నిదర్శనమన్నారు. అభివృద్ధి జరిగే అమరావతి కావాలో.. అభివృద్ధి లేని అమరావతి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాజధాని ప్రాంత ప్రజలు.. ధర్నాలు, ఉద్యమాలు ఆపేసి స్వచ్ఛందంగా ముందుకొస్తే అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.

ఇదీ చదవండి: సీఎం జగన్​కు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వాలి: హర్ష కుమార్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే సీఐడీ నోటీసులు ఇచ్చారని.. దానిని తెదేపా నేతలు భూతద్దంలో చూపించి గగ్గోలు పెట్టడం సరికాదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తప్పు చేయలేదనే నమ్మకం బాబుకు ఉంటే సీఐడీ విచారణకు హాజరై తన సత్యశీలతను నిరూపించుకోవాలన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఎస్సీల భూములను తెదేపా నేతలు అన్యాక్రాంతం చేశారని... ఈ స్కాంలో చంద్రబాబు డైరెక్టర్ అయితే.. లోకేష్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారని విమర్శించారు.

రాష్ట్ర ప్రజలంతా రాజధాని వికేంద్రీకరణ కోరుతున్నారని... దానికి మున్సిపల్ ఫలితాలే నిదర్శనమన్నారు. అభివృద్ధి జరిగే అమరావతి కావాలో.. అభివృద్ధి లేని అమరావతి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాజధాని ప్రాంత ప్రజలు.. ధర్నాలు, ఉద్యమాలు ఆపేసి స్వచ్ఛందంగా ముందుకొస్తే అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.

ఇదీ చదవండి: సీఎం జగన్​కు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వాలి: హర్ష కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.