ETV Bharat / city

జీజీహెచ్​ భోజనశాల నిర్మాణం పనులు పరిశీలించిన మంత్రి శ్రీరంగనాధరాజు

గుంటూరు జీజీహెచ్​లో నిర్మిస్తున్న ఉచిత భోజనశాల నిర్మాణం పనులను మంత్రి శ్రీరంగనాధరాజు పరిశీలించారు. పూర్తి హంగులతో ఈ భోజనశాలను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

author img

By

Published : Dec 16, 2020, 7:58 AM IST

minister ranganath visit guntur GGh
minister ranganath visit guntur GGh

గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో జిల్లా ఇన్​చార్జి మంత్రి శ్రీరంగనాధరాజు పర్యటించారు. రోగుల సహాయకులకు రెండు పూటలా ఉచితంగా భోజనం అందించే భోజనశాల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పూర్తి హంగులతో ఈ భోజనశాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి.. నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు.

ఈ నిర్మాణానికి జిల్లా ఇన్​చార్జి మంత్రి శ్రీరంగనాధరాజు ఇప్పటికే కోటి రూపాయలను సొంత నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. రోగుల సహాయకుల భవన నిర్మాణంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతికి మంత్రి శ్రీరంగనాధరాజు కొన్ని సూచనలు ఇచ్చారు.

గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో జిల్లా ఇన్​చార్జి మంత్రి శ్రీరంగనాధరాజు పర్యటించారు. రోగుల సహాయకులకు రెండు పూటలా ఉచితంగా భోజనం అందించే భోజనశాల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పూర్తి హంగులతో ఈ భోజనశాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి.. నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు.

ఈ నిర్మాణానికి జిల్లా ఇన్​చార్జి మంత్రి శ్రీరంగనాధరాజు ఇప్పటికే కోటి రూపాయలను సొంత నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. రోగుల సహాయకుల భవన నిర్మాణంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతికి మంత్రి శ్రీరంగనాధరాజు కొన్ని సూచనలు ఇచ్చారు.

ఇదీ చదవండి:

తితిదేకు గుదిబండగా మారుతున్న శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.