గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా... గుంటూరు జీజీహెచ్లో 450 పడకలతో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రి కొవిడ్-19 ఆసుపత్రిగా సేవలందిస్తుండగా..కేసులు పెరుగుతున్న కారణంగా.. జీజీహెచ్లోని పాత బ్లాకును కోవిడ్ ఆసుపత్రిగా మార్చనున్నారు. జీజీహెచ్ కొత్త బ్లాకులో సాధారణ, అత్యవసర వైద్య సేవలు కొనసాగనున్నాయని తెలిపారు. కొవిడ్-19 జిల్లా ప్రత్యేకాధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ అనంద్ కుమార్ ఆసుపత్రిని పరిశీలించారు. కొత్త, పాత బ్లాకుల మధ్య బారికేడ్లు, ఇతర ఏర్పాట్లపై.. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడుకి ప్రత్యేక అధికారి, కలెక్టర్ సూచనలు చేశారు.
ఇదీ చదవండి: