ETV Bharat / city

Ganja: గంజాయి అక్రమ రవాణా..ముగ్గురు అరెస్టు

author img

By

Published : Nov 7, 2021, 8:45 PM IST

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు బస్టాండ్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ. 72 వేల విలువ చేసే 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి అక్రమ రవాణా
గంజాయి అక్రమ రవాణా

గుంటూరు బస్టాండ్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 72 వేల విలువ చేసే 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి కర్ణాటకలోని బళ్లారికి గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని కిలో 4 వేల రూపాయలకు కొనుగోలు చేసి..బళ్లారిలో రూ.18 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పాత గుంటూరు సీఐ వాసు చెప్పారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ పెట్టామన్నారు.

పోలీసుల తనిఖీలు..

గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. గుంటూరు బస్టాండ్ వద్ద గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన బస్సుల్లో ప్రయాణీకుల లగేజీలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. గంజా, ఇతర మత్తు పదార్దాల రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని...అన్ని బస్సులు, వాహనాల్లో తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రూ.40 లక్షల విలువైన గంజాయి పట్టివేత

గుంటూరు బస్టాండ్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 72 వేల విలువ చేసే 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి కర్ణాటకలోని బళ్లారికి గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని కిలో 4 వేల రూపాయలకు కొనుగోలు చేసి..బళ్లారిలో రూ.18 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పాత గుంటూరు సీఐ వాసు చెప్పారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ పెట్టామన్నారు.

పోలీసుల తనిఖీలు..

గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. గుంటూరు బస్టాండ్ వద్ద గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన బస్సుల్లో ప్రయాణీకుల లగేజీలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. గంజా, ఇతర మత్తు పదార్దాల రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని...అన్ని బస్సులు, వాహనాల్లో తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రూ.40 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.