ETV Bharat / city

West godavari: నల్లజర్లలో యువకుని కిడ్నాప్​, హత్య

author img

By

Published : Jul 28, 2021, 4:07 PM IST

ఓ యువకున్ని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేసి హత్య చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో జరిగింది.

kidnapping
కిడ్నాప్

గుర్తు తెలియని ఆగంతకులు ఓ యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో జరిగింది. పోతవరంలో నిట్ విద్యార్థి కొనకళ్ల వంశీ (21) కిడ్నాప్, హత్య గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసింది.

బాదంపూడికి చెందిన కొనకళ్ల శ్రీను.. పోతవరం గ్రామంలో చికెన్ షాప్ నడుపుతూ స్థిరపడ్డాడు. అతనికి ఇద్దరు కుమారులు. చిన్నవాడు వంశీ.. కలకత్తాలోని నిట్​లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో తండ్రి వద్ద ఉంటున్నాడు.

మంగళవారం రాత్రి షాప్ మూసిన తర్వాత తండ్రికి చెప్పి బయటికి వెళ్లాడు. గంట తర్వాత తండ్రి.. శ్రీనుకి ఫోన్ చేయగా గుర్తుతెలియని అగంతకులు ఫోన్ లిఫ్ట్ చేసి 'మీ కుమారుడు మా వద్దనే ఉన్నాడు రూ.50 లక్షలు కావాలి' అని డిమాండ్ చేశారు. నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిలో డబ్బులు పెట్టి వెళ్లి పోవాలని కిడ్నాపర్లు చెప్పారు. దీంతో కంగారుపడిన తండ్రి బంధువులను వెంట తీసుకుని నల్లజర్ల పోలీస్ స్టేషన్​కు వెళ్లి విషయం వివరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

బుధవారం ఉదయం పోతవరం గ్రామ శివారులో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీ పరిసరాల్లో వంశీ మృత దేహం లభ్యమైంది. వంశీ మృతదేహాన్ని చూసిన తండ్రి, సోదరుడు కన్నీళ్ల పర్యంతమయ్యారు. దీనికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు.

గ్రామస్థులు, మృతుని బంధువులు, స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం రాత్రి 8:30 గంటలకు వంశీ.. స్నేహితులు తనని కారులో ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లారని అంటున్నారు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని వంశీ.. బాగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అంటున్నారు.

ఇదీ చదవండి: Eluru Mayor: ఏలూరు మేయర్‌గా దూదేకుల మహిళకు అవకాశం: సజ్జల

గుర్తు తెలియని ఆగంతకులు ఓ యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో జరిగింది. పోతవరంలో నిట్ విద్యార్థి కొనకళ్ల వంశీ (21) కిడ్నాప్, హత్య గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసింది.

బాదంపూడికి చెందిన కొనకళ్ల శ్రీను.. పోతవరం గ్రామంలో చికెన్ షాప్ నడుపుతూ స్థిరపడ్డాడు. అతనికి ఇద్దరు కుమారులు. చిన్నవాడు వంశీ.. కలకత్తాలోని నిట్​లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో తండ్రి వద్ద ఉంటున్నాడు.

మంగళవారం రాత్రి షాప్ మూసిన తర్వాత తండ్రికి చెప్పి బయటికి వెళ్లాడు. గంట తర్వాత తండ్రి.. శ్రీనుకి ఫోన్ చేయగా గుర్తుతెలియని అగంతకులు ఫోన్ లిఫ్ట్ చేసి 'మీ కుమారుడు మా వద్దనే ఉన్నాడు రూ.50 లక్షలు కావాలి' అని డిమాండ్ చేశారు. నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిలో డబ్బులు పెట్టి వెళ్లి పోవాలని కిడ్నాపర్లు చెప్పారు. దీంతో కంగారుపడిన తండ్రి బంధువులను వెంట తీసుకుని నల్లజర్ల పోలీస్ స్టేషన్​కు వెళ్లి విషయం వివరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

బుధవారం ఉదయం పోతవరం గ్రామ శివారులో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీ పరిసరాల్లో వంశీ మృత దేహం లభ్యమైంది. వంశీ మృతదేహాన్ని చూసిన తండ్రి, సోదరుడు కన్నీళ్ల పర్యంతమయ్యారు. దీనికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు.

గ్రామస్థులు, మృతుని బంధువులు, స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం రాత్రి 8:30 గంటలకు వంశీ.. స్నేహితులు తనని కారులో ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లారని అంటున్నారు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని వంశీ.. బాగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అంటున్నారు.

ఇదీ చదవండి: Eluru Mayor: ఏలూరు మేయర్‌గా దూదేకుల మహిళకు అవకాశం: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.