ఎన్నికలు ప్రజల కోసమా.. లేదా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోసమా స్పష్టం చేయాలని వైకాపా ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. నిమ్మగడ్డకు తొందర ఎక్కువ అయిందని.. దాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఓ వైపు ప్రజలు, ఉద్యోగులు తమ ప్రాణాలు ముఖ్యమంటుంటే ఎస్ఈసీకి తొందరెందుకని నిలదీశారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం.. గ్లాస్ షీల్డ్లో 5 మీటర్ల దూరంలో మీడియా సమావేశం పెడుతున్నారని.. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు మాత్రం ముఖ్యం కాదా అని బాలశౌరి అన్నారు. చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్లో కూర్చొని.. రాష్ట్రంలో ఎన్నికలు పెట్టాలని అంటారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: