రాజధాని కోసం భూములిచ్చాం...ఎందుకు వెనక్కి తగ్గుతాం? - legislative capital in amaravthi news
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 59వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరులో మహిళలు జై అమరావతి ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ..రాజధానికి అనుకూలంగా నినాదాలు చేశారు. అమరావతి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పట్టుదలతో అమరావతి ఉద్యమాన్ని చేస్తున్నామని..తమ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని స్పష్టం చేశారు. 'మూడు రాజధానులు వద్దు- ఒక్క రాజధాని ముద్దు' అంటూ నినాదాలు చేశారు.