ETV Bharat / city

పవన్ చెప్పినట్లు అన్ని పార్టీలు.. ప్రభుత్వంపై పోరాడాలి: విష్ణుకుమార్‌ రాజు

author img

By

Published : Oct 3, 2021, 2:26 PM IST

Updated : Oct 3, 2021, 7:42 PM IST

జనసేనాని పవన్‌పై వ్యక్తిగత విమర్శలను భాజపా నేత విష్ణుకుమార్‌ రాజు(bjp leader vishnu kumar raja fire on ycp) ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పవన్​ ప్రశ్నిస్తే.. వైకాపా పేయిడ్​ బ్యాచ్​ విమర్శలు చేస్తున్నాయని మండిపట్టారు.

vishnu kumar
vishnu kumar

జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై వైకాపా నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నట్లు భాజపా నేత విష్ణుకుమార్ రాజు(bjp leader vishnu kumar raja fire on ycp) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పవన్​ కల్యాణ్​ ప్రశ్నిస్తే.. వైకాపా పేయిడ్ బ్యాచ్​లు విమర్శలు చేస్తున్నాయని విష్ణు కుమార్ రాజు అన్నారు. పవన్ కళ్యాణ్​పై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణం అన్నారు. పోసానికి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. ఈ మేరకు విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైకాపా నేతలు.. రాష్ట్ర రాజకీయాలను నీచ స్థితికి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ చెబితే ఢిల్లీ కోటలు బీటలు తీస్తామని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్​ అంటున్నారు.. ఢిల్లీ కోట తలచుకుంటే మీరు ఏమౌతారో చూసుకోండని హెచ్చరించారు. దమ్ముంటే వైకాపా ఎంపీలు.. కోడి కత్తి, వివేకా హత్య కేసుల దర్యాప్తుపై హోంమంత్రి అమిత్​ శాను అడగాలన్నారు. రాష్ట్రానికి అప్పులు ఇస్తున్న బ్యాంకర్ల వ్యవహార శైలిపై అనుమానం ఉందన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం మారితే సీఎం కూడా మారాలన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటానికి అన్ని పార్టీలు కలసి కట్టుగా పని చేయాలని విష్ణు కుమార్​ రాజ(bjp leader vishnu kumar raja) కోరారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై వైకాపా నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నట్లు భాజపా నేత విష్ణుకుమార్ రాజు(bjp leader vishnu kumar raja fire on ycp) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పవన్​ కల్యాణ్​ ప్రశ్నిస్తే.. వైకాపా పేయిడ్ బ్యాచ్​లు విమర్శలు చేస్తున్నాయని విష్ణు కుమార్ రాజు అన్నారు. పవన్ కళ్యాణ్​పై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణం అన్నారు. పోసానికి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. ఈ మేరకు విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైకాపా నేతలు.. రాష్ట్ర రాజకీయాలను నీచ స్థితికి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ చెబితే ఢిల్లీ కోటలు బీటలు తీస్తామని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్​ అంటున్నారు.. ఢిల్లీ కోట తలచుకుంటే మీరు ఏమౌతారో చూసుకోండని హెచ్చరించారు. దమ్ముంటే వైకాపా ఎంపీలు.. కోడి కత్తి, వివేకా హత్య కేసుల దర్యాప్తుపై హోంమంత్రి అమిత్​ శాను అడగాలన్నారు. రాష్ట్రానికి అప్పులు ఇస్తున్న బ్యాంకర్ల వ్యవహార శైలిపై అనుమానం ఉందన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం మారితే సీఎం కూడా మారాలన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటానికి అన్ని పార్టీలు కలసి కట్టుగా పని చేయాలని విష్ణు కుమార్​ రాజ(bjp leader vishnu kumar raja) కోరారు.

ఇదీ చదవండి: Bhabanipur bypoll: కొనసాగుతున్న దీదీ హవా.. ప్రియాంకపై 39వేల ఓట్ల ఆధిక్యం

Last Updated : Oct 3, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.