ETV Bharat / city

బడ్జెట్​లో ఏపీకి తీరని అన్యాయం: తులసిరెడ్డి

author img

By

Published : Feb 1, 2021, 8:45 PM IST

కేంద్ర బడ్జెట్​లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ నాలుగు రాష్ట్రాల బడ్జెట్​లా ఉందన్నారు.

Tulasireddy
తులసిరెడ్డి

ఇది ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల బడ్జెట్​లా ఉందే కానీ భారతదేశ బడ్జెట్​లా లేదని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్​కు బడ్జెట్​లో తీరని అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, పోర్టులు, లోటు బడ్జెట్ వంటి ఏ ఒక్క అంశం కూడా లేదన్నారు.

ఎన్నికల సమయంలో కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్​లో రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాలు ఏ ఒక్కటి లేకపోవడం... అవి సాధిస్తామని చెప్పిన వైకాపా ఎంపీలు మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు.

ఇది ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల బడ్జెట్​లా ఉందే కానీ భారతదేశ బడ్జెట్​లా లేదని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్​కు బడ్జెట్​లో తీరని అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, పోర్టులు, లోటు బడ్జెట్ వంటి ఏ ఒక్క అంశం కూడా లేదన్నారు.

ఎన్నికల సమయంలో కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్​లో రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాలు ఏ ఒక్కటి లేకపోవడం... అవి సాధిస్తామని చెప్పిన వైకాపా ఎంపీలు మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: 'బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనేది..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.