ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

.

author img

By

Published : Feb 22, 2022, 8:59 PM IST

ప్రధాన వార్తలు @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM
  • సీబీఐకి ఏం చెప్పొద్దు.. 20 ఎకరాల భూమి ఇస్తాం.. వెలుగులోకి దస్తగిరి వాంగ్మూలం!

మాజీ మంత్రి వివేకా హత్యకేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి గత సెప్టెంబరు 30న సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు బయటికి వచ్చాయి. పులివెందుల కోర్టులో ఇవాళ నలుగురు నిందితులకు సంబంధించి అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సంబంధిత న్యాయవాదులకు అందజేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేపు నెల్లూరు జిల్లాకు సీఎం జగన్.. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు

రేపు మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్.. అంత్యక్రియలకు హాజరుకానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​.. దర్శన టికెట్ల సంఖ్య పెంపు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • GVL: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోంది: భాజపా ఎంపీ జీవీఎల్

ఎస్సీల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోందని.. ఆయన మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మణిపుర్​లో ప్రధాన ప్రచారాంశంగా 'రాజకీయ హింస'

Manipur Polls 2022: మణిపుర్‌ ఎన్నికల్లో ఈసారి రాజకీయ హింస కూడా ప్రచారాంశంగా నిలుస్తోంది. కాంగ్రెస్​తో పాటు ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా ​ ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బజరంగ్​ దళ్ కార్యకర్త హత్యపై దర్యాప్తు ముమ్మరం- ఆరుగురు అరెస్ట్​

కర్ణాటకలో జరిగిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హత్యకేసులో నిందితులందర్నీ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి.. అరెస్టులు ప్రారంభించారు. త్వరలోనే మిగతావారిని అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తును ఎన్​ఐఏకు అప్పగించాలని భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేప్​ను ప్రతిఘటించిందని బాధితురాలి హత్య.. శవంపైనే అత్యాచారం

రేప్​ ప్రయత్నం విఫలం కాగా చంపి.. బాధితురాలి మృతదేహంపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ ఘటన దిల్లీ బురారీలో జరిగింది. మరో ఘటనలో టాయిలెట్​ కోసం స్కూల్​ వెనుకకు వెళ్లిన పదేళ్ల బాలికను రేప్​ చేశాడు 50 ఏళ్ల వ్యక్తి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'కశ్మీర్​పై మోదీతో టీవీ డిబేట్​కు రెడీ'

భారత ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ డిబేట్​లో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ చర్చ ద్వారా ఇరు దేశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైతే ఉపఖండంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ బాలుడికి అండగా భారత స్టార్ క్రికెటర్.. రూ.31 లక్షలు సాయం

భారత క్రికెటర్​ కేఎల్​ రాహుల్​.. ఓ బాలుడికి అండగా నిలిచాడు. అరుదైన రక్త రుగ్మతతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడి ఆపరేషన్​కు రూ.31 లక్షలు సమకూర్చి తన ఔదార్యం చాటుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆర్యన్​ ఖాన్​ బాలీవుడ్​ ఎంట్రీ.. నటుడిగా మాత్రం కాదు!

ఆర్యన్​ ఖాన్​ను వెండితెరపై చూడాలని బాలీవుడ్​ సూపర్​స్టార్ షారుక్​ ఖాన్​ ఫ్యాన్స్​ ఆత్రుతగా ఉన్నారు. అయితే తండ్రి అడుగుజాడల్లో నడించేందుకు ఆర్యన్​ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కెమేరా వెనుక ప్రపంచంపై అతడు మరింత ఆకర్షితుడైనట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సీబీఐకి ఏం చెప్పొద్దు.. 20 ఎకరాల భూమి ఇస్తాం.. వెలుగులోకి దస్తగిరి వాంగ్మూలం!

మాజీ మంత్రి వివేకా హత్యకేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి గత సెప్టెంబరు 30న సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు బయటికి వచ్చాయి. పులివెందుల కోర్టులో ఇవాళ నలుగురు నిందితులకు సంబంధించి అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సంబంధిత న్యాయవాదులకు అందజేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేపు నెల్లూరు జిల్లాకు సీఎం జగన్.. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు

రేపు మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్.. అంత్యక్రియలకు హాజరుకానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​.. దర్శన టికెట్ల సంఖ్య పెంపు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • GVL: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోంది: భాజపా ఎంపీ జీవీఎల్

ఎస్సీల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోందని.. ఆయన మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మణిపుర్​లో ప్రధాన ప్రచారాంశంగా 'రాజకీయ హింస'

Manipur Polls 2022: మణిపుర్‌ ఎన్నికల్లో ఈసారి రాజకీయ హింస కూడా ప్రచారాంశంగా నిలుస్తోంది. కాంగ్రెస్​తో పాటు ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా ​ ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బజరంగ్​ దళ్ కార్యకర్త హత్యపై దర్యాప్తు ముమ్మరం- ఆరుగురు అరెస్ట్​

కర్ణాటకలో జరిగిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హత్యకేసులో నిందితులందర్నీ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి.. అరెస్టులు ప్రారంభించారు. త్వరలోనే మిగతావారిని అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తును ఎన్​ఐఏకు అప్పగించాలని భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేప్​ను ప్రతిఘటించిందని బాధితురాలి హత్య.. శవంపైనే అత్యాచారం

రేప్​ ప్రయత్నం విఫలం కాగా చంపి.. బాధితురాలి మృతదేహంపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ ఘటన దిల్లీ బురారీలో జరిగింది. మరో ఘటనలో టాయిలెట్​ కోసం స్కూల్​ వెనుకకు వెళ్లిన పదేళ్ల బాలికను రేప్​ చేశాడు 50 ఏళ్ల వ్యక్తి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'కశ్మీర్​పై మోదీతో టీవీ డిబేట్​కు రెడీ'

భారత ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ డిబేట్​లో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ చర్చ ద్వారా ఇరు దేశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైతే ఉపఖండంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ బాలుడికి అండగా భారత స్టార్ క్రికెటర్.. రూ.31 లక్షలు సాయం

భారత క్రికెటర్​ కేఎల్​ రాహుల్​.. ఓ బాలుడికి అండగా నిలిచాడు. అరుదైన రక్త రుగ్మతతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడి ఆపరేషన్​కు రూ.31 లక్షలు సమకూర్చి తన ఔదార్యం చాటుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆర్యన్​ ఖాన్​ బాలీవుడ్​ ఎంట్రీ.. నటుడిగా మాత్రం కాదు!

ఆర్యన్​ ఖాన్​ను వెండితెరపై చూడాలని బాలీవుడ్​ సూపర్​స్టార్ షారుక్​ ఖాన్​ ఫ్యాన్స్​ ఆత్రుతగా ఉన్నారు. అయితే తండ్రి అడుగుజాడల్లో నడించేందుకు ఆర్యన్​ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కెమేరా వెనుక ప్రపంచంపై అతడు మరింత ఆకర్షితుడైనట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.