ETV Bharat / city

టెన్త్​ ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. విచారణ నేటికి వాయిదా

author img

By

Published : May 18, 2022, 7:29 PM IST

Updated : May 19, 2022, 12:33 AM IST

Tenth Class Question Paper Leakage Case: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వీటిపై తగిన ఆదేశాల జారీ నిమిత్తం విచారణ నేటికి వాయిదా పడింది.

హైకోర్టు
హైకోర్టు

SSC Paper Leakage Case: పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ ఆరోపణలతో కేసులో ముందస్తు బెయిల్​ కోసం మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు కె పునీత్​తోపాటు మరి కొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యాల్లో తగిన ఆదేశాల జారీ నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మథరావు ఈమేరకు ఆదేశాలిచ్చారు.

విచారణ సందర్భంగా.. పిటిషనర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. మాల్ ప్రాక్టీసుతో పిటిషనర్లకు సంబంధంలేదన్నారు. నారాయణ విద్యా సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కారణంగా పిటిషనర్లను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందన్నారు. పబ్లిక్ పరీక్షల చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు ఐపీసీ సెక్షన్లు పెట్టడానికి వీల్లేదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు నిబంధనలను పోలీసులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎఫ్​ఐఆర్​లో పిటిషనర్లు నిందితులు కాదని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. ఈనేపథ్యంలో వారు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్లకు విచారణ అర్హత లేదన్నారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. దీంతో న్యాయమూర్తి విచారణను నేటికి(19కి) వాయిదా వేశారు. హౌజ్ మోషన్ రూపంలో దాఖలైన ఈ అత్యవసర వ్యాజ్యాలపై ఈనెల 15న విచారణ జరిపిన న్యాయమూర్తి.. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

SSC Paper Leakage Case: పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ ఆరోపణలతో కేసులో ముందస్తు బెయిల్​ కోసం మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు కె పునీత్​తోపాటు మరి కొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యాల్లో తగిన ఆదేశాల జారీ నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మథరావు ఈమేరకు ఆదేశాలిచ్చారు.

విచారణ సందర్భంగా.. పిటిషనర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. మాల్ ప్రాక్టీసుతో పిటిషనర్లకు సంబంధంలేదన్నారు. నారాయణ విద్యా సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కారణంగా పిటిషనర్లను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందన్నారు. పబ్లిక్ పరీక్షల చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు ఐపీసీ సెక్షన్లు పెట్టడానికి వీల్లేదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు నిబంధనలను పోలీసులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎఫ్​ఐఆర్​లో పిటిషనర్లు నిందితులు కాదని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. ఈనేపథ్యంలో వారు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్లకు విచారణ అర్హత లేదన్నారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. దీంతో న్యాయమూర్తి విచారణను నేటికి(19కి) వాయిదా వేశారు. హౌజ్ మోషన్ రూపంలో దాఖలైన ఈ అత్యవసర వ్యాజ్యాలపై ఈనెల 15న విచారణ జరిపిన న్యాయమూర్తి.. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

Last Updated : May 19, 2022, 12:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.