ETV Bharat / city

Jagan assets case: "ప్రజాప్రయోజనాల కోసం.. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి"

author img

By

Published : Dec 3, 2021, 6:17 PM IST

Updated : Dec 4, 2021, 4:47 AM IST

Telangana high court adjourn Jagan Plea: సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్​ను తెలంగాణ హైకోర్టు విచారించింది. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరారు.

Jagan assets case
Jagan illegal assets case

Telangana high court adjourn Jagan Plea: జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని పిటిషన్​లో ప్రస్తావించారు. సీఎంగా రోజువారీ విచారణకు హాజరైతే పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన వల్ల విచారణ ఆలస్యమవుతోందన్న వాదనలో నిజం లేదని పేర్కొన్నారు.

జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘పాలనా పనులతో పాటు ప్రొటోకాల్‌ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సీఎం హోదాలో ఉన్న ఆయనను కలవడానికి పలువురు కోర్టుకు ఎక్కువగా వస్తారు. దీనివల్ల అందరికీ ఇబ్బందులే. ఈ కేసుల్లో ఇతర నిందితుల కారణంగా విచారణలో స్టే వచ్చింది. పిటిషనర్‌ ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు పొందలేదు. సీఎం కాకముందు దాదాపుగా ప్రతి వారం హాజరయ్యారు. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇందులో 11 కేసులున్నాయి. వీటిలో కొన్ని 2జీ కేసు కన్నా 5 రెట్లు సంక్లిష్టమైనవి. అందువల్ల విచారణకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రతిసారి హాజరుకావడం సాధ్యం కాదు. ప్రజా విధులు నిర్వహించేవారు నిందితులుగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు, సుప్రీంకోర్టులు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి...’ అని పేర్కొన్నారు. సత్యం రామలింగరాజు కేసులో ఒక జడ్జిని పూర్తిగా కేటాయించి 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రెండేళ్లకుపైగా పట్టిందని ఆయన ఉదహరించారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుపై ఉన్న కేసులో ఎన్నిసార్లు హాజరయ్యారని ఆరా తీశారు. బీహార్‌ వంటి రాష్ట్రాల్లో నిందితులు హాజరైతే సాక్షులు మాట్లాడటానికి భయపడుతుంటారని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు లేవనుకుంటానని వ్యాఖ్యానించారు. సీబీఐ వాదనల నిమిత్తం విచారణను 6వ తేదీకి వాయిదా వేశారు.

కేసు వివరాలు ఇలా..
CBI cases on Jagan: అక్రమాస్తుల కేసుల్లో జగన్​కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది సీబీఐ కోర్టు నిరాకరించింది. అయితే.. కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతేడాదే జగన్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భూయాన్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టగా.. సీబీఐ వాదనలు వినిపించేందు కోసం డిసెంబరు 6వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ నిమిత్తం వారానికి 5 రోజులు కోర్టుకు హాజరైనట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. రోజువారీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులకూ ఆటంకమన్నారు. హాజరు మినహాయింపుపై వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో జగన్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

Cyclone Jawad warning for AP: అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు.. అధికారుల హెచ్చరిక

Telangana high court adjourn Jagan Plea: జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని పిటిషన్​లో ప్రస్తావించారు. సీఎంగా రోజువారీ విచారణకు హాజరైతే పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన వల్ల విచారణ ఆలస్యమవుతోందన్న వాదనలో నిజం లేదని పేర్కొన్నారు.

జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘పాలనా పనులతో పాటు ప్రొటోకాల్‌ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సీఎం హోదాలో ఉన్న ఆయనను కలవడానికి పలువురు కోర్టుకు ఎక్కువగా వస్తారు. దీనివల్ల అందరికీ ఇబ్బందులే. ఈ కేసుల్లో ఇతర నిందితుల కారణంగా విచారణలో స్టే వచ్చింది. పిటిషనర్‌ ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు పొందలేదు. సీఎం కాకముందు దాదాపుగా ప్రతి వారం హాజరయ్యారు. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇందులో 11 కేసులున్నాయి. వీటిలో కొన్ని 2జీ కేసు కన్నా 5 రెట్లు సంక్లిష్టమైనవి. అందువల్ల విచారణకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రతిసారి హాజరుకావడం సాధ్యం కాదు. ప్రజా విధులు నిర్వహించేవారు నిందితులుగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు, సుప్రీంకోర్టులు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి...’ అని పేర్కొన్నారు. సత్యం రామలింగరాజు కేసులో ఒక జడ్జిని పూర్తిగా కేటాయించి 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రెండేళ్లకుపైగా పట్టిందని ఆయన ఉదహరించారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుపై ఉన్న కేసులో ఎన్నిసార్లు హాజరయ్యారని ఆరా తీశారు. బీహార్‌ వంటి రాష్ట్రాల్లో నిందితులు హాజరైతే సాక్షులు మాట్లాడటానికి భయపడుతుంటారని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు లేవనుకుంటానని వ్యాఖ్యానించారు. సీబీఐ వాదనల నిమిత్తం విచారణను 6వ తేదీకి వాయిదా వేశారు.

కేసు వివరాలు ఇలా..
CBI cases on Jagan: అక్రమాస్తుల కేసుల్లో జగన్​కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది సీబీఐ కోర్టు నిరాకరించింది. అయితే.. కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతేడాదే జగన్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భూయాన్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టగా.. సీబీఐ వాదనలు వినిపించేందు కోసం డిసెంబరు 6వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ నిమిత్తం వారానికి 5 రోజులు కోర్టుకు హాజరైనట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. రోజువారీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులకూ ఆటంకమన్నారు. హాజరు మినహాయింపుపై వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో జగన్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

Cyclone Jawad warning for AP: అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు.. అధికారుల హెచ్చరిక

Last Updated : Dec 4, 2021, 4:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.