ETV Bharat / city

'అధికారం అండతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు'

author img

By

Published : Jul 2, 2020, 1:03 PM IST

అధికారం అండతో వైకాపా నేతలు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి విమర్శించారు. బీఎస్​-4 వాహనాల కేసులో జేసీ ప్రభాకర్​రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.

'అధికారం అండతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు'
'అధికారం అండతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు'

అధికార వైకాపా వ్యవస్థలను నాశనం చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆరోపించారు. తెదేపా నేతలపై దాడులకు సంబంధించి ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్​రెడ్డికి చెందిన వాహనాలు సీజ్​ చేయడం అనధికారమని కోర్టు గతంలోనే చెప్పిందన్న ఆయన.. ప్రభుత్వం కోర్టు నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడ్డారు.

దురుద్దేశంతోనే ప్రభాకర్​రెడ్డిపై 40కి పైగా కేసులు పెట్టారని దీపక్​రెడ్డి ధ్వజమెత్తారు. 40 ఎఫ్​ఐఆర్​లలో ప్రభాకర్​రెడ్డి పేరు లేనప్పుడు ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు.

అధికార వైకాపా వ్యవస్థలను నాశనం చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆరోపించారు. తెదేపా నేతలపై దాడులకు సంబంధించి ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్​రెడ్డికి చెందిన వాహనాలు సీజ్​ చేయడం అనధికారమని కోర్టు గతంలోనే చెప్పిందన్న ఆయన.. ప్రభుత్వం కోర్టు నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడ్డారు.

దురుద్దేశంతోనే ప్రభాకర్​రెడ్డిపై 40కి పైగా కేసులు పెట్టారని దీపక్​రెడ్డి ధ్వజమెత్తారు. 40 ఎఫ్​ఐఆర్​లలో ప్రభాకర్​రెడ్డి పేరు లేనప్పుడు ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు.

ఇదీ చూడండి..

'నిర్మలాసీతారామన్​పై కేసు ఎందుకు పెట్టలేదు..?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.