ETV Bharat / city

'అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెనుక ఉద్దేశమేంటి?'

రాజధాని అంశాన్ని రాజకీయ క్రీడగా మార్చి ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దని వైకాపా ప్రభుత్వాన్ని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధాని సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అని చెబుతూనే.. రాజధాని పరిధిలోని గ్రామాల సంఖ్యను కుదించడం వైకాపా ప్రభుత్వ కక్షపూరిత ఆలోచనలకు, స్వార్థపూరిత విధానాలకు నిదర్శనమని విమర్శించారు.

author img

By

Published : Jan 26, 2020, 7:57 AM IST

tdp mla anagani satya prasad wrote open letter to cm jagan
tdp mla anagani satya prasad wrote open letter to cm jagan

భూసమీకరణలో లేని గ్రామాలను కలిపేసి... అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌(ఏసీసీఎంసీ) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌కు ఆయన రాసిన బహిరంగ లేఖలో రాజధానికి సంబంధించిన పలు ప్రశ్నలు లేవనెత్తారు. మూడు రాజధానుల అంశం హైకోర్టు పరిధిలో, సీఆర్​డీఏ రద్దు బిల్లు సెలెక్ట్‌ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉండగా... రాజధాని గ్రామాల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయటం చట్టవిరుద్ధం కాదా అని ప్రశ్నించారు. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నప్పుడు గుర్తుకురాని ప్రజాభిప్రాయ సేకరణ... అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌ విషయంలో ఎందుకని నిలదీశారు. రాజధాని తరలింపులో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడమేనన్నారు. రాజధాని అంశాన్ని రాజకీయ క్రీడగా మార్చి ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దని విజప్తి చేశారు.అమరావతి రాజధాని సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అని చెబుతూనే.. రాజధాని పరిధిలోని గ్రామాల సంఖ్యను కుదించడం వైకాపా ప్రభుత్వ కక్షపూరిత ఆలోచనలకు, స్వార్ధపూరిత విధానాలకు నిదర్శనమని అన్నారు. రైతులతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రూ.4 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని వివరించారు.ఇప్పటికైనా అమరావతి విషయంలో సంకుచిత ఆలోచనలు మాని.. ఉదారంగా ఆలోచించాలని... రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు.

భూసమీకరణలో లేని గ్రామాలను కలిపేసి... అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌(ఏసీసీఎంసీ) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌కు ఆయన రాసిన బహిరంగ లేఖలో రాజధానికి సంబంధించిన పలు ప్రశ్నలు లేవనెత్తారు. మూడు రాజధానుల అంశం హైకోర్టు పరిధిలో, సీఆర్​డీఏ రద్దు బిల్లు సెలెక్ట్‌ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉండగా... రాజధాని గ్రామాల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయటం చట్టవిరుద్ధం కాదా అని ప్రశ్నించారు. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నప్పుడు గుర్తుకురాని ప్రజాభిప్రాయ సేకరణ... అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌ విషయంలో ఎందుకని నిలదీశారు. రాజధాని తరలింపులో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడమేనన్నారు. రాజధాని అంశాన్ని రాజకీయ క్రీడగా మార్చి ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దని విజప్తి చేశారు.అమరావతి రాజధాని సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అని చెబుతూనే.. రాజధాని పరిధిలోని గ్రామాల సంఖ్యను కుదించడం వైకాపా ప్రభుత్వ కక్షపూరిత ఆలోచనలకు, స్వార్ధపూరిత విధానాలకు నిదర్శనమని అన్నారు. రైతులతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రూ.4 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని వివరించారు.ఇప్పటికైనా అమరావతి విషయంలో సంకుచిత ఆలోచనలు మాని.. ఉదారంగా ఆలోచించాలని... రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు.

ఇదీ చదవండి:అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సన్నాహాలు!

Reporter : S.P.Chandra Sekhar Date : 25-01-2020 Centre : Guntur File : AP_GNT_10_25_Tdp_Mla_Anagani_Letter_To_CM_AV_3053245 ( ) భూసమీకరణలో లేని గ్రామాలను తీసుకొచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రతిపాదన దేనికోసమో చెప్పాలని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి... జగన్మోహన్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో, సీఆర్‌డిఏ రద్దు బిల్లు సెలెక్ట్‌ కమిటి వద్ద పెండింగ్‌లో ఉండగా రాజధాని గ్రామాల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం చట్ట విరుద్దం కాదా అని ప్రశ్నించారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన రాజధానిపై మీరు అనుసరిస్తున్న విధానం చట్ట విరుద్దంగా ఉందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు గుర్తుకురాని ప్రజాభిప్రాయ సేకరణ.. అమరావతి కార్పోరేషన్ విషయంలో ఎందుకన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాటించాల్సిన విధి విధానాలు అనుసరించకపోవటం ప్రజల్ని మోసం చేయటమేనన్నారు. రాజధాని తరలింపులో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడమేనన్నారు. రాజధాని అంశాన్ని రాజకీయ క్రీడగా మార్చి ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దని విజప్తి చేశారు. అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అని చెబుతూనే.. రాజధాని పరిధిలోని గ్రామాల సంఖ్యను కుదించడం వైసీపీ ప్రభుత్వ కక్షపూరిత ఆలోచనలకు, స్వార్ధపూరిత విధానాలకు నిదర్శనంగా అభివర్ణించారు. ప్రజా వేదిక కూల్చేముందు గానీ, మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి అలజడులు సృష్టించేటప్పుడు గానీ, సీఆర్‌డిఏ రద్దు అంశాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు గానీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఎందుకు అనుకోలేదని ప్రశ్నించారు. మీ నియంతృత్వ పోకడలు, ఏకపక్ష విధానాలు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతాయన్నారు. రైతులతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రూ.4 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని వివరించారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని... అలా కాకుండా.. వ్యక్తిగత స్వార్ధం కోసం కోట్లాది మంది జీవితాలను నాశనం చేసేలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అమరావతి విషయంలో సంకుచిత ఆలోచనలు మాని.. ఉదారంగా ఆలోచించాలని... రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు. విజివల్స్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.