ETV Bharat / city

ఐదో రోజూ అదే తీరు.. సభ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్​

author img

By

Published : Dec 4, 2020, 9:25 PM IST

అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆఖరి రోజూ సభ నుంచి తెదేపా సభ్యులు సస్పెండ్​ అయ్యారు. పీటీఐ కథనం ప్రకారం ఐదో రోజు సభ నుంచి 10 మంది తెదేపా శాసనసభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఇందుకు నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు, తెదేపా ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

Tdp members
Tdp members

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల్లో వరుసగా ఐదో రోజూ సభ నుంచి తెదేపా ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. పీటీఐ కథనం ప్రకారం... సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారన్న కారణంతో... ఆఖరిరోజు సభ నుంచి 10 మంది తెదేపా ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్​​కు నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మిగిలిన ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అంతకుముందు సభలో తెదేపా ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ తీర్మానంపై చర్చించాలని కోరింది.

తెదేపా వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం​ తిరస్కరించారు. తెదేపా శాసనసభ్యులు తీర్మానంపై చర్చించాలని పట్టుబడ్డారు. ఏడాదిగా లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందలేదని అన్నారు. సభ వెల్​లోకి వెళ్లి నిరసన తెలిపారు. తీర్మానంపై చర్చించాలని నిరసన చేశారు.

'మీరు ప్రతి రోజు సభా కార్యకలాపాలను అడ్డుపడుతున్నారు. మిమ్మల్ని సస్పెండ్​ చేయడం నాకు బాధగా ఉంది. అయినా మరో దారిలేదు' అని స్పీకర్ తమ్మినేని సీతారామ్​ అన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్​ చేసేందుకు సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

ఇదీ చదవండి : ఏపీకి కోటి కొవిడ్ వ్యాక్సిన్లు కేటాయించే అవకాశం: సీఎం జగన్​

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల్లో వరుసగా ఐదో రోజూ సభ నుంచి తెదేపా ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. పీటీఐ కథనం ప్రకారం... సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారన్న కారణంతో... ఆఖరిరోజు సభ నుంచి 10 మంది తెదేపా ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్​​కు నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మిగిలిన ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అంతకుముందు సభలో తెదేపా ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ తీర్మానంపై చర్చించాలని కోరింది.

తెదేపా వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం​ తిరస్కరించారు. తెదేపా శాసనసభ్యులు తీర్మానంపై చర్చించాలని పట్టుబడ్డారు. ఏడాదిగా లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందలేదని అన్నారు. సభ వెల్​లోకి వెళ్లి నిరసన తెలిపారు. తీర్మానంపై చర్చించాలని నిరసన చేశారు.

'మీరు ప్రతి రోజు సభా కార్యకలాపాలను అడ్డుపడుతున్నారు. మిమ్మల్ని సస్పెండ్​ చేయడం నాకు బాధగా ఉంది. అయినా మరో దారిలేదు' అని స్పీకర్ తమ్మినేని సీతారామ్​ అన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్​ చేసేందుకు సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

ఇదీ చదవండి : ఏపీకి కోటి కొవిడ్ వ్యాక్సిన్లు కేటాయించే అవకాశం: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.