ETV Bharat / city

అమరావతి బృహత్​ ప్రణాళికపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

అమరావతి బృహత్​ ప్రణాళికకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్​ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్​పై విచారణను సుప్రీంకోర్టు వారం రోజులు వాయిదా వేసింది. దీనికి సంబంధించి ఇతర పిటిషన్లను కలిపి విచారించాలన్న ప్రభుత్వ తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు సర్వోన్నత న్యాయస్థానం.. అన్నింటినీ కలిపి విచారిస్తామని తెలిపింది.

author img

By

Published : Aug 6, 2020, 3:05 AM IST

అమరావతి బృహత్​ ప్రణాళికపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
అమరావతి బృహత్​ ప్రణాళికపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

అమరావతి బృహత్​ ప్రణాళిక(మాస్టర్​ ప్లాన్​)కు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్​ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను సుప్రీంకోర్టు వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్​పై బుధవారం జస్టిస్​ అరుణ్​మిశ్ర, జస్టిస్​ బీఆర్​ గవాయి, జస్టిస్​ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్​ న్యాయవాదులు హరీష్​ సాల్వే, ఆత్మారాం నడ్​కర్ణి, ఎస్​ నిరంజన్​రెడ్డి, న్యాయవాది నజ్కీలు వాదనలు వినిపించారు.

మాస్టర్​ ప్లాన్​తో ముడిపడి ఇతర పిటిషన్లు కూడా ఉన్నాయని వాటన్నింటినీ కలిపి విచారించాలని లిఖితపూర్వకంగా కోరారు. అమరావతి రైతులకు కేటాయించిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించి జారీ చేసిన జీవోపై కూడా హైకోర్టు స్టే ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్​ చేసింది. దీన్ని కూడా జత చేయాలని సాల్వే కోరగా.. అనుమతించిన ధర్మాసనం పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారిస్తామంది.

అమరావతి బృహత్​ ప్రణాళిక(మాస్టర్​ ప్లాన్​)కు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్​ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను సుప్రీంకోర్టు వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్​పై బుధవారం జస్టిస్​ అరుణ్​మిశ్ర, జస్టిస్​ బీఆర్​ గవాయి, జస్టిస్​ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్​ న్యాయవాదులు హరీష్​ సాల్వే, ఆత్మారాం నడ్​కర్ణి, ఎస్​ నిరంజన్​రెడ్డి, న్యాయవాది నజ్కీలు వాదనలు వినిపించారు.

మాస్టర్​ ప్లాన్​తో ముడిపడి ఇతర పిటిషన్లు కూడా ఉన్నాయని వాటన్నింటినీ కలిపి విచారించాలని లిఖితపూర్వకంగా కోరారు. అమరావతి రైతులకు కేటాయించిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించి జారీ చేసిన జీవోపై కూడా హైకోర్టు స్టే ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్​ చేసింది. దీన్ని కూడా జత చేయాలని సాల్వే కోరగా.. అనుమతించిన ధర్మాసనం పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారిస్తామంది.

ఇదీ చూడండి..

ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇంకా అందని పింఛన్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.