ETV Bharat / city

జ్వరపీడితులకు మందులు, ఐసోలేషన్ కిట్లు అందజేస్తాం: సింఘాల్

author img

By

Published : May 16, 2021, 9:29 PM IST

రాష్ట్రంలో జ్వరపీడితుల గుర్తింపు ప్రక్రియ నేటితో పూర్తికానుండగా.. బాధితులకు మందులు, ఐసోలేషన్ కిట్లు అందజేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్​కుమార్ సింఘాల్ వెల్లడించారు. అన్ని ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు వివరించారు. బ్లాక్ ఫంగస్ కేసులేమైనా నమోదయ్యాయా అని అధికారులు ఆరా తీస్తున్నారని చెప్పారు.

health department chief secretary anil kumar singhal
వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

జ్వరపీడితుల గుర్తింపునకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతోందని.. నేటితో పూర్తయ్యే అవకాశముందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ 39 వేల మంది జ్వరపీడితులను గుర్తించారని వెల్లడించారు. బాధితులందరికీ ఏఎన్ఎంలు మందులు, ఐసోలేషన్ కిట్లు అందజేస్తారని వివరించారు. ప్రస్తుతం ఏపీలో 522 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని.. ఎక్కడా రెమ్​డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉన్నట్లు ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. వాటి వినియోగంపై జిల్లా అధికారులు ఆడిట్ చేస్తున్నారని వివరించారు. టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్​లు తనిఖీలు నిర్వహించి పలు ఆసుపత్రులపై జరిమానాలు విధించాయని సింఘాల్ చెప్పారు.

ఇదీ చదవండి: కొవిషీల్డ్ రెండో డోసుపై కేంద్రం కీలక ప్రకటన

రాష్ట్రానికి ఇచ్చే ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు సింఘాల్ పేర్కొన్నారు. గత 24 గంటల్లో కేంద్రం నుంచి 600 టన్నులు ప్రాణవాయువు అందిందని వివరించారు. రోజూ కంటే 10 టన్నులు అదనంగా ఆదివారం వినియోగించామని చెప్పారు. జామ్​నగర్ నుంచి 80 టన్నులు, జమ్​షెడ్​పూర్ నుంచి 60 టన్నులు, దుర్గాపూర్ నుంచి 40 టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి చేరిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ పూర్తి స్థాయి నిల్వలు ఉన్నాయని.. ఇంకా అదనంగా ఉంచామని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కేసులు రాష్ట్రంలో ఎక్కడైనా నమోదయ్యాయా అని అధికారులు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. దాని నివారణ కోసం ఏపీకి 1600 వయల్స్​ను కేంద్రం కేటాయించగా.. వాటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

జ్వరపీడితుల గుర్తింపునకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతోందని.. నేటితో పూర్తయ్యే అవకాశముందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ 39 వేల మంది జ్వరపీడితులను గుర్తించారని వెల్లడించారు. బాధితులందరికీ ఏఎన్ఎంలు మందులు, ఐసోలేషన్ కిట్లు అందజేస్తారని వివరించారు. ప్రస్తుతం ఏపీలో 522 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని.. ఎక్కడా రెమ్​డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉన్నట్లు ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. వాటి వినియోగంపై జిల్లా అధికారులు ఆడిట్ చేస్తున్నారని వివరించారు. టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్​లు తనిఖీలు నిర్వహించి పలు ఆసుపత్రులపై జరిమానాలు విధించాయని సింఘాల్ చెప్పారు.

ఇదీ చదవండి: కొవిషీల్డ్ రెండో డోసుపై కేంద్రం కీలక ప్రకటన

రాష్ట్రానికి ఇచ్చే ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు సింఘాల్ పేర్కొన్నారు. గత 24 గంటల్లో కేంద్రం నుంచి 600 టన్నులు ప్రాణవాయువు అందిందని వివరించారు. రోజూ కంటే 10 టన్నులు అదనంగా ఆదివారం వినియోగించామని చెప్పారు. జామ్​నగర్ నుంచి 80 టన్నులు, జమ్​షెడ్​పూర్ నుంచి 60 టన్నులు, దుర్గాపూర్ నుంచి 40 టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి చేరిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ పూర్తి స్థాయి నిల్వలు ఉన్నాయని.. ఇంకా అదనంగా ఉంచామని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కేసులు రాష్ట్రంలో ఎక్కడైనా నమోదయ్యాయా అని అధికారులు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. దాని నివారణ కోసం ఏపీకి 1600 వయల్స్​ను కేంద్రం కేటాయించగా.. వాటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 24,171 కరోనా కేసులు, 101 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.