ETV Bharat / city

Milk distribution: పాల సరఫరాకు ఆన్‌లైన్‌ విధానం... పారదర్శకత కోసమేనన్న ప్రభుత్వం

అంగన్‌వాడీ కేంద్రాలకు పాలను సరఫరా చేస్తున్న వ్యవస్థలో లొసుగులను అరికట్టేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చింది. కొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. దీనివల్ల పారదర్శకత పెరగడంతోపాటు పాల ప్యాకెట్లు నల్లబజారుకు తరలకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.

author img

By

Published : Jul 22, 2021, 9:12 AM IST

special software and website for milk distribution
పాల సరఫరా కోసం ఆన్‌లైన్‌ విధానం

చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం గత ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 30.16 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. అన్ని కేంద్రాలకు కలిపి నెలకు 1.13 కోట్ల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. దీనికోసం కేఎంఎఫ్‌ (కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌)తో ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఒప్పందం చేసుకుంది.

లబ్ధిదారులకు అందాల్సిన పాల ప్యాకెట్లు పలుచోట్ల బహిరంగ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. పాల కేంద్రాలకు రవాణా చేసేవారు,లబ్ధిదారులకు అందజేయాల్సిన సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి దారి మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనలు చాల వెలుగుచూస్తున్నాయి. సరఫరా వ్యవస్థను ఆన్‌లైన్‌లోకి తెచ్చేందుకు ఏపీ డెయిరీ ఎం.డి. బాబు ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ను అభివృద్ధి చేయించారు.

ఈ వెబ్‌సైట్​ మొబైల్‌లో పనిచేసేలా తీర్చిదిద్దారు. గత మూడు వారాల నుంచి కొత్త ఆన్‌లైన్‌ విధానం అమలవుతోంది. పాల ప్యాకెట్లు ఇండెంట్‌ నుంచి లబ్ధిదారుకు చేరే వరకు అన్ని స్థాయిల్లో వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాని వివిధ సాంకేతిక సమస్యలు రావడం వల్ల పాల సరఫరా ఆలస్యం అవుతోంది. సాధారణంగా 55 లక్షల లీటర్ల పాలు అంగన్‌వాడీలకు చేరాల్సిన సమయంలో కేవలం 10 లక్షల లీటర్లు మాత్రమే చేరుతున్నాయి.

మొబైల్‌ యాప్‌, వెబ్‌ సాఫ్ట్ వేర్ వివరాల నమోదు సందర్భంగా వస్తున్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాల సరఫర కోసం బాధ్యతలు తీసుకున్న ఏ ఒక్కరు అందుబాటులో లేకపోయినా సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటోందని, సరఫరాను వేగవంతం చేసేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ysr Kapu Nestam: నేడు వైఎస్సార్​ కాపు నేస్తం రెండో ఏడాది నిధులు విడుదల

చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం గత ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 30.16 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. అన్ని కేంద్రాలకు కలిపి నెలకు 1.13 కోట్ల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. దీనికోసం కేఎంఎఫ్‌ (కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌)తో ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఒప్పందం చేసుకుంది.

లబ్ధిదారులకు అందాల్సిన పాల ప్యాకెట్లు పలుచోట్ల బహిరంగ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. పాల కేంద్రాలకు రవాణా చేసేవారు,లబ్ధిదారులకు అందజేయాల్సిన సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి దారి మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనలు చాల వెలుగుచూస్తున్నాయి. సరఫరా వ్యవస్థను ఆన్‌లైన్‌లోకి తెచ్చేందుకు ఏపీ డెయిరీ ఎం.డి. బాబు ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ను అభివృద్ధి చేయించారు.

ఈ వెబ్‌సైట్​ మొబైల్‌లో పనిచేసేలా తీర్చిదిద్దారు. గత మూడు వారాల నుంచి కొత్త ఆన్‌లైన్‌ విధానం అమలవుతోంది. పాల ప్యాకెట్లు ఇండెంట్‌ నుంచి లబ్ధిదారుకు చేరే వరకు అన్ని స్థాయిల్లో వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాని వివిధ సాంకేతిక సమస్యలు రావడం వల్ల పాల సరఫరా ఆలస్యం అవుతోంది. సాధారణంగా 55 లక్షల లీటర్ల పాలు అంగన్‌వాడీలకు చేరాల్సిన సమయంలో కేవలం 10 లక్షల లీటర్లు మాత్రమే చేరుతున్నాయి.

మొబైల్‌ యాప్‌, వెబ్‌ సాఫ్ట్ వేర్ వివరాల నమోదు సందర్భంగా వస్తున్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాల సరఫర కోసం బాధ్యతలు తీసుకున్న ఏ ఒక్కరు అందుబాటులో లేకపోయినా సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటోందని, సరఫరాను వేగవంతం చేసేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ysr Kapu Nestam: నేడు వైఎస్సార్​ కాపు నేస్తం రెండో ఏడాది నిధులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.