ETV Bharat / city

తెలంగాణ: ఎల్బీస్టేడియంలో శాట్స్ కోచ్​ల ఆందోళన - రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్​రెడ్డి

"తెలంగాణ వచ్చాకైనా మా బతుకులు బాగుపడతాయనుకుంటే.. ఇంకా దుర్భరంగా మారాయి. జీతాలు కూడా సమయానికి ఇవ్వటం లేదు. ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు వేడుకున్నా స్పందన లేదు." అంటూ శాట్స్​ కోచ్​లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేశారు.

shats coaches protest in lbstadium, sports coaches agitation in lb stadium
ఎల్బీస్టేడియంలో శాట్స్ కోచ్​ల ఆందోళన, ఎల్బీ స్టేడియంలో ఆందోళనకు దిగిన శాట్స్ కోచ్​లు
author img

By

Published : Apr 3, 2021, 9:13 PM IST

హైదరాబాద్​లోని ఎల్బీస్టేడియంలో శాట్స్ కోచ్​లు మెరుపు ఆందోళనకు దిగారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్​లుగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలంటూ.. ఎండీ కార్యాలయం ముందు బైఠాయించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్​రెడ్డిని లోపలికి రాకుండా కారుకు అడ్డంగా పడుకున్నారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు వేడుకున్నా స్పందన లేదన్నారు. తెలంగాణ వచ్చాకైనా తమ బతుకులు బాగుపడతాయనుకుంటే.. దుర్భరంగా మరాయన్నారు. జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని వాపోయారు.

రాష్ట్రం ఏర్పడ్డాక కోచ్​లకి గానీ... క్రీడలకు గాని రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 జిల్లాలో 330 మంది కోచ్​లు అవసరం ఉంటే.. ప్రస్తుతం ఉన్నది కేవలం నలుగురు రెగ్యులర్ కోచ్​లు మాత్రమే ఉన్నారని తెలిపారు. అదే క్రీడా శాఖ, శాట్స్ అడ్మినిస్ట్రేషన్​లో మాత్రం 200 మంది ఉన్నారని... ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. తమ సమస్యలను పెడచెవిన పెడుతున్న ఛైర్మెన్ వెంటనే రాజీనామా చేయాాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్... 3 నెలల ముందు అధికారులకు సూచించారని... అయినా ఎక్కడి ఫైల్స్ అక్కడే ఉన్నాయన్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ధర్నా చేస్తున్నామన్నారు.

హైదరాబాద్​లోని ఎల్బీస్టేడియంలో శాట్స్ కోచ్​లు మెరుపు ఆందోళనకు దిగారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్​లుగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలంటూ.. ఎండీ కార్యాలయం ముందు బైఠాయించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్​రెడ్డిని లోపలికి రాకుండా కారుకు అడ్డంగా పడుకున్నారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు వేడుకున్నా స్పందన లేదన్నారు. తెలంగాణ వచ్చాకైనా తమ బతుకులు బాగుపడతాయనుకుంటే.. దుర్భరంగా మరాయన్నారు. జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని వాపోయారు.

రాష్ట్రం ఏర్పడ్డాక కోచ్​లకి గానీ... క్రీడలకు గాని రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 జిల్లాలో 330 మంది కోచ్​లు అవసరం ఉంటే.. ప్రస్తుతం ఉన్నది కేవలం నలుగురు రెగ్యులర్ కోచ్​లు మాత్రమే ఉన్నారని తెలిపారు. అదే క్రీడా శాఖ, శాట్స్ అడ్మినిస్ట్రేషన్​లో మాత్రం 200 మంది ఉన్నారని... ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. తమ సమస్యలను పెడచెవిన పెడుతున్న ఛైర్మెన్ వెంటనే రాజీనామా చేయాాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్... 3 నెలల ముందు అధికారులకు సూచించారని... అయినా ఎక్కడి ఫైల్స్ అక్కడే ఉన్నాయన్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ధర్నా చేస్తున్నామన్నారు.

ఇదీ చూడండి:

గుణదల విద్యుత్‌ ఉపకేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.