ETV Bharat / city

High Court : ఉత్తర్వులు వెల్లడించే దశలో వాదనలా?

author img

By

Published : May 19, 2022, 10:24 PM IST

Updated : May 20, 2022, 4:48 AM IST

పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణ కుమార్తెలు శరణి, సింధూర, అల్లుడు పునీత్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ప్రభుత్వం తరపున అదనపు ఏజీ వాదనలు వినిపిస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్​ హైకోర్టుకు తెలియజేశారు. అందుకు సమయం కావాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

ప్రశ్నాపత్రం లీకేజీ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
ప్రశ్నాపత్రం లీకేజీ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు, మరికొందరు ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇరువైపులా వాదనలు పూర్తయి ఉత్తర్వులు వెల్లడించే దశలో అదనపు ఏజీ వాదనలు వినిపిస్తారని, సమయం కావాలని అదనపు పీపీ దుశ్యంత్‌రెడ్డి కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాదనలు పూర్తి కావడంతో వ్యాజ్యాలపై న్యాయస్థానం ఓ నిర్ణయానికి వచ్చిందని, ఈ దశలో మళ్లీ వాదనలు చెబుతామనడం సరికాదని వ్యాఖ్యానించింది.

అదనపు ఏజీ వాదనలు వినిపించాలని అనుకుంటే ఆ విషయం ముందే కోర్టుకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తగిన ఉత్తర్వులు జారీ చేయడం కోసమే బుధవారం నుంచి గురువారానికి వాయిదా వేశామని గుర్తు చేసింది. అంతిమంగా ఈ వ్యాజ్యాలపై విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌ ఆరోపణలతో చిత్తూరు ఒకటో పట్టణ ఠాణాలో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్‌, నారాయణ విద్యా సంస్థ సొసైటీకి చెందిన డిప్యూటీ జనరల్‌ మేనేజరు జె.కొండలరావు, ఎం.కిశోర్‌, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్‌ ప్రసాద్‌, వి.శ్రీనాథ్‌, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్‌, జి.సురేశ్‌కుమార్‌, ఎం.మునిశంకర్‌, బి.కోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చూడండి

మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు, మరికొందరు ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇరువైపులా వాదనలు పూర్తయి ఉత్తర్వులు వెల్లడించే దశలో అదనపు ఏజీ వాదనలు వినిపిస్తారని, సమయం కావాలని అదనపు పీపీ దుశ్యంత్‌రెడ్డి కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాదనలు పూర్తి కావడంతో వ్యాజ్యాలపై న్యాయస్థానం ఓ నిర్ణయానికి వచ్చిందని, ఈ దశలో మళ్లీ వాదనలు చెబుతామనడం సరికాదని వ్యాఖ్యానించింది.

అదనపు ఏజీ వాదనలు వినిపించాలని అనుకుంటే ఆ విషయం ముందే కోర్టుకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తగిన ఉత్తర్వులు జారీ చేయడం కోసమే బుధవారం నుంచి గురువారానికి వాయిదా వేశామని గుర్తు చేసింది. అంతిమంగా ఈ వ్యాజ్యాలపై విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌ ఆరోపణలతో చిత్తూరు ఒకటో పట్టణ ఠాణాలో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్‌, నారాయణ విద్యా సంస్థ సొసైటీకి చెందిన డిప్యూటీ జనరల్‌ మేనేజరు జె.కొండలరావు, ఎం.కిశోర్‌, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్‌ ప్రసాద్‌, వి.శ్రీనాథ్‌, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్‌, జి.సురేశ్‌కుమార్‌, ఎం.మునిశంకర్‌, బి.కోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చూడండి

Last Updated : May 20, 2022, 4:48 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.