ETV Bharat / city

ఏసీబీ అధిపతిగా పీఎస్​ఆర్​ ఆంజనేయులు

author img

By

Published : Jan 5, 2020, 9:32 AM IST

రాష్ట్ర ఏసీబీ డీజీగా పి.సీతారామాంజనేయులును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీగా ఉన్న కుమార్​ విశ్వజిత్​ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

ఏసీబీ అధిపతిగా పీఎస్​ఆర్​ ఆంజనేయులు
ఏసీబీ అధిపతిగా పీఎస్​ఆర్​ ఆంజనేయులు

రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు. ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను ఏసీబీ డీజీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రవాణా శాఖ కమిషనర్‌గానూ, ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగాలని సూచించింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సర్కారు ఆదేశించింది. ఏసీబీ పనితీరు బాగోలేదని సీఎం జగన్‌ రెండు రోజుల కిందట ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో విశ్వజిత్‌ బదిలీ కావటం విశేషం.

ఇదీ చూడండి:

రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు. ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను ఏసీబీ డీజీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రవాణా శాఖ కమిషనర్‌గానూ, ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగాలని సూచించింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సర్కారు ఆదేశించింది. ఏసీబీ పనితీరు బాగోలేదని సీఎం జగన్‌ రెండు రోజుల కిందట ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో విశ్వజిత్‌ బదిలీ కావటం విశేషం.

ఇదీ చూడండి:

కమిటీలే వేరు.. నివేదిక ఒకటే : కె.నాగేశ్వర్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.