ETV Bharat / city

పల్లె పోరు: ఆ పంచాయతీకి సర్పంచి ఉండరు... ఎందుకంటే..?

పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే చాలు... చిత్ర విచిత్రాలు.. అనూహ్య పరిణామాలు సాధారణమే..! కానీ ఆ పంచాయతీలో మాత్రం కాస్త విభిన్న పరిస్థితే. అంతటా ఎన్నికలు జరిగినట్లే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. కానీ సర్పంచి అభ్యర్థి స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాదు. వార్డు స్థానాలకు మాత్రం ఎన్నికలు జరుగుతాయి. సర్పంచి లేకుండానే పాలనా కార్యక్రమాలు జరిగిపోతుంటాయ్...! మరీ ఆ పంచాయతీలో ఈ పరిస్థితి రావటానికి కారణం...రిజర్వేషన్స్...! మరీ ఆ రిజర్వేషన్ కథేంటి..?సర్పంచి లేని పంచాయతీ కార్యవర్గం ఎలా కొలువుదీరుతుందనేది చూద్దాం...!

author img

By

Published : Feb 7, 2021, 1:16 PM IST

Updated : Feb 7, 2021, 2:23 PM IST

ap panchayat elections 2021
ap local polls 2021

వెంకటరెడ్డిపేట.. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండంలోని ఓ పంచాయతీ..! ఇక్కడ ఎన్నికలు జరిగిన ప్రతీసారి సర్పంచి లేకుండా పాలన సాగిపోతుంది. వార్డు స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగడం.. వారిచేత ఎన్నుకోబడిన ఉపసర్పంచే.... సర్పంచిగా పాలన సాగించడం ఓ తంతులా మారిపోయింది.

అసలు కథ ఇదీ....

వెంకటరెడ్డిపేట షెడ్యూల్-5లో ఉన్న గిరిజన ప్రాంతం. ఇక్కడ రిజర్వేషన్ల అంటే...ఎస్టీ జనరల్ కావాలి లేదంటే ఎస్టీ మహిళకు కేటాయించాలి. కానీ ఇక్కడ ఒక్క గిరిజనుడు కూడా లేకపోవడమే సమస్యకు కారణమైంది. రిజర్వేషన్లు ఏమైనా మార్చే అవకాశం ఉందా..అంటే ఎట్టిపరిస్థితుల్లో కుదరదు. మార్చాలంటే రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకోవాలి. ఇదీ అంత సులభంగా జరిగే పని కాదంటున్నారు నిపుణులు..!

ఉప సర్పంచే....

ఒక్క గిరిజనుడూ లేకపోయినా.. గత కొన్ని పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో ఎస్టీ రిజర్వేషన్‌ కొనసాగుతోంది వెంకటరెడ్డిపేట పంచాయతీలో. ఫలితంగా సర్పంచి పీఠం ఖాళీగా ఉంటూ మిగిలిన వార్డు స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఆరు వార్డుల్లో 295 మంది ఓటర్లున్న ఈ పంచాయతీలో.. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు లేరు. బీసీ, ఇతరులు ఉన్నారు.

ఉప సర్పంచిని ఎన్నుకోవడం.. ఆయనే సర్పంచిగా పాలన సాగించడం ఇక్కడ రివాజుగా మారింది. నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా సర్పంచి పదవికి ఒక్క నామినేషన్‌ పడని విచిత్ర పరిస్థితి ఇక్కడ నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్‌ మార్చే అవకాశం లేదని, వెంకటరెడ్డిపేట పంచాయతీ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌.వి.నాగేశ్వర నాయక్‌ చెప్పారు.

ఇదీ చదవండి

ఇదీ సంగతి: సర్పంచి నుంచి శాసనసభ వరకు..

వెంకటరెడ్డిపేట.. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండంలోని ఓ పంచాయతీ..! ఇక్కడ ఎన్నికలు జరిగిన ప్రతీసారి సర్పంచి లేకుండా పాలన సాగిపోతుంది. వార్డు స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగడం.. వారిచేత ఎన్నుకోబడిన ఉపసర్పంచే.... సర్పంచిగా పాలన సాగించడం ఓ తంతులా మారిపోయింది.

అసలు కథ ఇదీ....

వెంకటరెడ్డిపేట షెడ్యూల్-5లో ఉన్న గిరిజన ప్రాంతం. ఇక్కడ రిజర్వేషన్ల అంటే...ఎస్టీ జనరల్ కావాలి లేదంటే ఎస్టీ మహిళకు కేటాయించాలి. కానీ ఇక్కడ ఒక్క గిరిజనుడు కూడా లేకపోవడమే సమస్యకు కారణమైంది. రిజర్వేషన్లు ఏమైనా మార్చే అవకాశం ఉందా..అంటే ఎట్టిపరిస్థితుల్లో కుదరదు. మార్చాలంటే రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకోవాలి. ఇదీ అంత సులభంగా జరిగే పని కాదంటున్నారు నిపుణులు..!

ఉప సర్పంచే....

ఒక్క గిరిజనుడూ లేకపోయినా.. గత కొన్ని పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో ఎస్టీ రిజర్వేషన్‌ కొనసాగుతోంది వెంకటరెడ్డిపేట పంచాయతీలో. ఫలితంగా సర్పంచి పీఠం ఖాళీగా ఉంటూ మిగిలిన వార్డు స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఆరు వార్డుల్లో 295 మంది ఓటర్లున్న ఈ పంచాయతీలో.. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు లేరు. బీసీ, ఇతరులు ఉన్నారు.

ఉప సర్పంచిని ఎన్నుకోవడం.. ఆయనే సర్పంచిగా పాలన సాగించడం ఇక్కడ రివాజుగా మారింది. నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా సర్పంచి పదవికి ఒక్క నామినేషన్‌ పడని విచిత్ర పరిస్థితి ఇక్కడ నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్‌ మార్చే అవకాశం లేదని, వెంకటరెడ్డిపేట పంచాయతీ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌.వి.నాగేశ్వర నాయక్‌ చెప్పారు.

ఇదీ చదవండి

ఇదీ సంగతి: సర్పంచి నుంచి శాసనసభ వరకు..

Last Updated : Feb 7, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.