ETV Bharat / city

కౌలు కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?: ముప్పాళ్ల నాగేశ్వరరావు

author img

By

Published : Aug 26, 2020, 7:37 PM IST

పెన్షన్ల కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏంటని సీపీఐ నేత నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 72 గంటల్లో రాజధాని రైతులకు కౌలుతో పాటు పెన్షన్​ సైతం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Muppalla Nageswara Rao
Muppalla Nageswara Rao

రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాలది కాదని... 13 జిల్లాల ప్రజలది అని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... మథర్​ థెరిస్సా జన్మదినం రోజున.. పెద్ద సంఖ్యలో అమరావతి మహిళలను అరెస్టు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని పరిధిలోని పేదలకు ఐదు వేల పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్... ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వైకాపా ఇచ్చిన వాగ్దానాలకు.. చేసే పనులకు పొంతన లేదన్నారు. కౌలు పెన్షన్ల కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడమేంటని నిలదీశారు. 72గంటల్లో రాజధాని రైతులకు కౌలు, పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాలది కాదని... 13 జిల్లాల ప్రజలది అని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... మథర్​ థెరిస్సా జన్మదినం రోజున.. పెద్ద సంఖ్యలో అమరావతి మహిళలను అరెస్టు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని పరిధిలోని పేదలకు ఐదు వేల పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్... ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వైకాపా ఇచ్చిన వాగ్దానాలకు.. చేసే పనులకు పొంతన లేదన్నారు. కౌలు పెన్షన్ల కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడమేంటని నిలదీశారు. 72గంటల్లో రాజధాని రైతులకు కౌలు, పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఓం ప్రతాప్​ కాల్​ డేటా తీయండి... డీజీపీకి చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.