ETV Bharat / city

రాష్ట్రంలో భారీగా పెరిగిన ఇంటర్నెట్‌ వినియోగం

author img

By

Published : Oct 30, 2020, 7:46 AM IST

రాష్ట్రంలో ఇంటర్నెట్‌ వాడకం భారీగా పెరిగింది. ఆన్‌లైన్‌ తరగతులు, ఇంటి నుంచే పని చేయటం, ఓటీటీలకు ఆదరణ పెరగటం తదితర కారణాల వల్ల డేటా ప్రాధాన్యం ఎక్కువైంది.

Massively increased internet usage in the state
మహాజోరుగా డేటా వాడకం

కరోనా లాక్‌డౌన్‌ తరువాత రాష్ట్రంలో ఇంటర్నెట్‌ డేటా వినియోగం భారీగా పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు టెలికం కంపెనీలు, బ్రాడ్‌బ్యాండ్‌, ఫైబర్‌నెట్‌ ప్రొవైడర్లు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. ‘గతంలో వారంలోని మిగతా రోజులకూ వారాంతాలకు డేటా వినియోగంలో చాలా తేడా ఉండేది. ప్రస్తుతం వారంలోని అన్ని రోజులూ ఒకే తరహా డేటా వినియోగం కనిపిస్తోంది. అది అంతకంతకూ పెరుగుతోంది’’ అని సంస్థలు చెబుతున్నాయి. గతంలో కంటే ఎక్కువ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను జనం కోరుకుంటున్నారు. అందుకే బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకూ గిరాకీ పెరిగింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌నెట్‌ (ఎఫ్‌టీటీహెచ్‌) కనెక్షన్లు ఏడు నెలల్లో 15,000 (75%) పెరగడం డేటా వాడకంలో వినియోగదారుల దూకుడును తెలియజేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే ఓ ఫైబర్‌నెట్‌ సంస్థ కరోనా తర్వాత రాష్ట్రంలో 40 వేలకు పైగా కనెక్షన్లను పెంచుకుంది.

వినియోగం ఎందుకు పెరిగిందంటే..

* కరోనా లాక్‌డౌన్‌ తరువాత చాలా మంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. గతంలో వర్క్‌ ఫ్రం హోం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు లాంటివాటికే పరిమితం. ఇప్పడది చాలా రంగాలకు విస్తరించింది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేసినవారు.. ఇప్పుడు అదే పనిని ఏపీలోని స్వస్థలాల్లో ఉండి ఇంటి నుంచే చేస్తున్నారు.

* రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు దాదాపు 35 లక్షల మంది. వీరిలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యేవారి సంఖ్య 20 లక్షలకు పైమాటే. రోజంతా ఇంట్లోనే ఉంటున్న పిల్లలు యూట్యూబ్‌ల్లోనూ, ఓటీటీల్లోనూ కిడ్స్‌ వీడియోలు చూస్తూ, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తుండటం కూడా డేటా వినియోగాన్ని పెంచుతోంది.

* ఇటీవల ఓటీటీ వేదికలకు బాగా ఆదరణ పెరిగింది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, వివిధ భాషల్లోని సినిమాలు.. సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంటుండటంతో సరికొత్త వినోద ప్రపంచంలో ప్రజలు విహరిస్తున్నారు.

* చాలామంది డీటీహెచ్‌, కేబుల్‌ వంటివి లేకుండా వినోద కార్యక్రమాలూ డేటాతోనే వీక్షిస్తున్నారు. నెలకు 500 జీబీ నుంచి 1,000 జీబీ వరకు డేటాను కేవలం గృహావసరాలకే వినియోగించేవారు సైతం ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే పలు సంస్థలు సరసమైన ధరలకే డేటా ప్లాన్లను అందుబాటులో ఉంచాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ పుంజుకుంది
20,000 ఫిబ్రవరి వరకు ఏపీలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు
15,000 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌లోగా కొత్తగా వచ్చినవి
1,854 టెరాబైట్స్‌ (టీబీ) ఫైబర్‌నెట్‌ వినియోగం ఫిబ్రవరి వరకు రోజుకు
5,536 (టీబీ) సెప్టెంబరు నెలాఖరుకు రోజుకు
93 జీబీలు గతంలో ఫైబర్‌నెట్‌ వినియోగదారుల డేటా వాడకం నెలకు సగటున
164 జీబీలు ప్రస్తుతం
25% బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ డేటా వినియోగంలో పెరుగుదల

‘జియో’ డేటా వినియోగం ప్రస్తుతం సగటున రోజుకు 6,000 టీబీ. లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు ఇది 20 నుంచి 25 శాతం పెరిగినట్లు అంచనా.
ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో మెరుగైన స్పీడ్‌ను అందించేందుకు ‘ఎయిర్‌టెల్‌’ ఫైబర్‌నెట్‌ సర్వీసులు ప్రారంభించింది.

కరోనా లాక్‌డౌన్‌ తరువాత రాష్ట్రంలో ఇంటర్నెట్‌ డేటా వినియోగం భారీగా పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు టెలికం కంపెనీలు, బ్రాడ్‌బ్యాండ్‌, ఫైబర్‌నెట్‌ ప్రొవైడర్లు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. ‘గతంలో వారంలోని మిగతా రోజులకూ వారాంతాలకు డేటా వినియోగంలో చాలా తేడా ఉండేది. ప్రస్తుతం వారంలోని అన్ని రోజులూ ఒకే తరహా డేటా వినియోగం కనిపిస్తోంది. అది అంతకంతకూ పెరుగుతోంది’’ అని సంస్థలు చెబుతున్నాయి. గతంలో కంటే ఎక్కువ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను జనం కోరుకుంటున్నారు. అందుకే బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకూ గిరాకీ పెరిగింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌నెట్‌ (ఎఫ్‌టీటీహెచ్‌) కనెక్షన్లు ఏడు నెలల్లో 15,000 (75%) పెరగడం డేటా వాడకంలో వినియోగదారుల దూకుడును తెలియజేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే ఓ ఫైబర్‌నెట్‌ సంస్థ కరోనా తర్వాత రాష్ట్రంలో 40 వేలకు పైగా కనెక్షన్లను పెంచుకుంది.

వినియోగం ఎందుకు పెరిగిందంటే..

* కరోనా లాక్‌డౌన్‌ తరువాత చాలా మంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. గతంలో వర్క్‌ ఫ్రం హోం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు లాంటివాటికే పరిమితం. ఇప్పడది చాలా రంగాలకు విస్తరించింది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేసినవారు.. ఇప్పుడు అదే పనిని ఏపీలోని స్వస్థలాల్లో ఉండి ఇంటి నుంచే చేస్తున్నారు.

* రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు దాదాపు 35 లక్షల మంది. వీరిలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యేవారి సంఖ్య 20 లక్షలకు పైమాటే. రోజంతా ఇంట్లోనే ఉంటున్న పిల్లలు యూట్యూబ్‌ల్లోనూ, ఓటీటీల్లోనూ కిడ్స్‌ వీడియోలు చూస్తూ, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తుండటం కూడా డేటా వినియోగాన్ని పెంచుతోంది.

* ఇటీవల ఓటీటీ వేదికలకు బాగా ఆదరణ పెరిగింది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, వివిధ భాషల్లోని సినిమాలు.. సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంటుండటంతో సరికొత్త వినోద ప్రపంచంలో ప్రజలు విహరిస్తున్నారు.

* చాలామంది డీటీహెచ్‌, కేబుల్‌ వంటివి లేకుండా వినోద కార్యక్రమాలూ డేటాతోనే వీక్షిస్తున్నారు. నెలకు 500 జీబీ నుంచి 1,000 జీబీ వరకు డేటాను కేవలం గృహావసరాలకే వినియోగించేవారు సైతం ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే పలు సంస్థలు సరసమైన ధరలకే డేటా ప్లాన్లను అందుబాటులో ఉంచాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ పుంజుకుంది
20,000 ఫిబ్రవరి వరకు ఏపీలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు
15,000 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌లోగా కొత్తగా వచ్చినవి
1,854 టెరాబైట్స్‌ (టీబీ) ఫైబర్‌నెట్‌ వినియోగం ఫిబ్రవరి వరకు రోజుకు
5,536 (టీబీ) సెప్టెంబరు నెలాఖరుకు రోజుకు
93 జీబీలు గతంలో ఫైబర్‌నెట్‌ వినియోగదారుల డేటా వాడకం నెలకు సగటున
164 జీబీలు ప్రస్తుతం
25% బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ డేటా వినియోగంలో పెరుగుదల

‘జియో’ డేటా వినియోగం ప్రస్తుతం సగటున రోజుకు 6,000 టీబీ. లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు ఇది 20 నుంచి 25 శాతం పెరిగినట్లు అంచనా.
ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో మెరుగైన స్పీడ్‌ను అందించేందుకు ‘ఎయిర్‌టెల్‌’ ఫైబర్‌నెట్‌ సర్వీసులు ప్రారంభించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.