ETV Bharat / city

'మనబడి, నాడు-నేడు' పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి సురేశ్

author img

By

Published : May 25, 2021, 10:42 PM IST

'మనబడి, నాడు-నేడు' కార్యక్రమం మొదటి విడత పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సురేశ్ అధికారులతో మాట్లాడారు. ఏపీఈడబ్ల్యూ ఐడీసీ, ట్రైబల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో జరుగుతున్న వాటిలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీల నిర్మాణాలు అన్నీ జూన్ 20 నాటికి పూర్తి చేయాలని.. ఇకపై జాప్యం జరిగితే కుదరదని హెచ్చరించారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న 'మనబడి, నాడు-నేడు' కార్యక్రమం మొదటి విడత పనులు జూన్ 20వ తేదీ వరకు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత పనుల్లో చాలావరకు పూర్తి అయినప్పటికీ... మిగిలిన అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయటం ద్వారా రెండోవిడత పనులు ప్రారంభించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సురేశ్ అధికారులతో మాట్లాడారు.

నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రహరీల నిర్మాణం, అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 557 ఉండగా అందులో 382 పూర్తయ్యాయని మిగిలిన 175 పనులు తక్షణమే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొత్తం 8038 పాఠశాలలకుగానూ ఇంకా 3681 చోట్ల ప్రహరీలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఏపీఈడబ్ల్యూ ఐడీసీ, ట్రైబల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో జరుగుతున్న వాటిలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీల నిర్మాణాలు అన్నీ జూన్ 20 నాటికి పూర్తి చేయాలని... ఇకపై జాప్యం జరిగితే కుదరదని హెచ్చరించారు.

జగనన్న విద్యాకానుక కిట్లపై మంత్రి మాట్లాడుతూ... పాఠశాలలకు చేర్చే సమయాల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. జూన్ 1 నుంచి సరఫరా ప్రారంభించి జూలై 3వ వారానికి పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని అధికారులు వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్ అమలవుతున్న కారణంగా... సామగ్రి రవాణా సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యా కానుకలోని అన్ని వస్తువులు జులైలో అధికారులు చెప్పిన సమయానికి తప్పనిసరిగా చేరేలా చూడాలని మంత్రి సురేశ్ ఆదేశించారు. ప్రీప్రైమరీ పాఠశాలల్లో సిలబస్ విధానం, అకడమిక్ రూట్ మ్యాప్​పై చర్చించారు.

ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు..

ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచనలను పరిగణనలోకి తీసుకొని.. సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి సురేశ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్య డైరెక్టర్ చిన్నవీరభద్రుడు, తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇటీవల కరోనాతో మరణించిన ఉపాధ్యాయులకు సంతాపం తెలిపారు. ఉపాధ్యాయులను ఫ్రంట్​లైన్ వారియర్స్​గా గుర్తించాలని, వివిధ యాప్​ల ద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలు పరిష్కరించాలని, కరోనాతో మరణించిన ఉపాధ్యాయులకు ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని కోరారు. బదిలీలు, ప్రమోషన్​లకు సంబంధించిన పలు విషయాలు ప్రస్తావించారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా..

ఈ సందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు తెలుసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఉపాధాయుల సూచనలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగా టీచర్ సెంటర్​లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఇందుకోసం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండీ... మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న 'మనబడి, నాడు-నేడు' కార్యక్రమం మొదటి విడత పనులు జూన్ 20వ తేదీ వరకు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత పనుల్లో చాలావరకు పూర్తి అయినప్పటికీ... మిగిలిన అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయటం ద్వారా రెండోవిడత పనులు ప్రారంభించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సురేశ్ అధికారులతో మాట్లాడారు.

నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రహరీల నిర్మాణం, అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 557 ఉండగా అందులో 382 పూర్తయ్యాయని మిగిలిన 175 పనులు తక్షణమే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొత్తం 8038 పాఠశాలలకుగానూ ఇంకా 3681 చోట్ల ప్రహరీలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఏపీఈడబ్ల్యూ ఐడీసీ, ట్రైబల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో జరుగుతున్న వాటిలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీల నిర్మాణాలు అన్నీ జూన్ 20 నాటికి పూర్తి చేయాలని... ఇకపై జాప్యం జరిగితే కుదరదని హెచ్చరించారు.

జగనన్న విద్యాకానుక కిట్లపై మంత్రి మాట్లాడుతూ... పాఠశాలలకు చేర్చే సమయాల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. జూన్ 1 నుంచి సరఫరా ప్రారంభించి జూలై 3వ వారానికి పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని అధికారులు వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్ అమలవుతున్న కారణంగా... సామగ్రి రవాణా సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యా కానుకలోని అన్ని వస్తువులు జులైలో అధికారులు చెప్పిన సమయానికి తప్పనిసరిగా చేరేలా చూడాలని మంత్రి సురేశ్ ఆదేశించారు. ప్రీప్రైమరీ పాఠశాలల్లో సిలబస్ విధానం, అకడమిక్ రూట్ మ్యాప్​పై చర్చించారు.

ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు..

ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచనలను పరిగణనలోకి తీసుకొని.. సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి సురేశ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్య డైరెక్టర్ చిన్నవీరభద్రుడు, తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇటీవల కరోనాతో మరణించిన ఉపాధ్యాయులకు సంతాపం తెలిపారు. ఉపాధ్యాయులను ఫ్రంట్​లైన్ వారియర్స్​గా గుర్తించాలని, వివిధ యాప్​ల ద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలు పరిష్కరించాలని, కరోనాతో మరణించిన ఉపాధ్యాయులకు ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని కోరారు. బదిలీలు, ప్రమోషన్​లకు సంబంధించిన పలు విషయాలు ప్రస్తావించారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా..

ఈ సందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు తెలుసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఉపాధాయుల సూచనలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగా టీచర్ సెంటర్​లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఇందుకోసం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండీ... మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.