ETV Bharat / city

PADAYATRA: నేడు అమరావతి మహాపాదయాత్ర.. పునః ప్రారంభం

author img

By

Published : Nov 14, 2021, 6:59 AM IST

ప్రకాశం జిల్లా నిడమనూరులోని వార్డులో ఉపఎన్నిక(by-poll in nidamanoor) కారణంగా మహాపాదయాత్రకు విరామం ప్రకటించిన రైతులు.. ఇవాళ ఉదయం 8 గంటలకు తిరిగి ప్రారంభించనున్నారు. 12వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లా యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆగింది.

PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్ర పునః ప్రారంభం
PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్ర పునః ప్రారంభం

అమరావతి ఆవశ్యకతను రాష్ట్రవ్యాప్తంగా తెలియచెప్పేందుకు ఓ మహా సంకల్పానికి రాజధాని రైతులు శ్రీకారం చుట్టిన మహా పాదయాత్ర ఇవాళ పునః ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ప్రకాశం జిల్లా నిడమనూరు గ్రామ పంచాయతీలో 12వ వార్డుకు ఈ నెల 14వ తేదీన ఉపఎన్నిక(by-poll) జరగనుంది. ఫలితంగా పాదయాత్ర జరపరాదని ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారి ఆదేశాలను గౌరవిస్తూ.. పాదయాత్రకు ఐకాస నేతలు విరామం ప్రకటించారు. 12వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లా యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆగింది. కాగా ఇవాళ ఉదయం అక్కడి నుంచే యాత్ర ప్రారంభం కానుంది.

అడుగడుగునా ఘనస్వాగతం..
12వరోజు(శుక్రవారం) ఒంగోలులో బృందావన కళ్యాణ మండపం నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. పోలీసుల పహారా నడుమ యాత్ర కొనసాగింది. రైతులకు.. ప్రజలు అడుగడుగునా పూలతో ఘన స్వాగతం పలికారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రలో ముందుకు సాగారు. రైతుల పాదయాత్రకు స్థానికులే కాకుండా సమీప గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై అమరావతి అనే నినాదాలు, డప్పు శబ్దాలు, కోలాట నృత్యాల మధ్య పాదయాత్ర సందడిగా సాగింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న రైతుల డిమాండ్‌కు ప్రకాశం జిల్లా ప్రజలు మద్దతు పలికారు. పాదయాత్రలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్‌తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ పార్టీ అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

రైతులపై లాఠీఛార్జ్..
ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర(amaravathi farmers padayatra).. గురువారం పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. ఇన్ని కఠిన ఆంక్షలు, నిర్బంధాల్నీ తోసిరాజని పరిసర గ్రామాల నుంచి వేల మంది తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు. అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో బలగాల్ని మోహరించిన పోలీసులు.. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు. చెక్‌పోస్టులు పెట్టి వాహనాల్ని మళ్లించారు. కనిపించిన ప్రతిఒక్కరినీ ఎక్కడికి వెళుతున్నారో అడిగి, పాదయాత్రకు కాదని నమ్మకం కుదిరితేనే పంపించారు.

వందల మంది పోలీసులు లాఠీలు(lotties) పట్టుకుని, పాదయాత్ర ముందు సాగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. వాహనాలపై తిరుగుతూ ప్రజల్ని అడ్డుకున్నారు. పాదయాత్రకు వెళ్లేందుకు వీల్లేదని, ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. హెచ్చరికల్ని కాదని ముందుకు వచ్చినవారిని తోసిపారేశారు. వందల మంది పోలీసులు రోప్‌పార్టీలతో ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు ఎదురుతిరిగి రైతుల దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు. ఒకరి చెయ్యి విరిగింది. నిబంధనలకు లోబడి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రకు కొవిడ్‌ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ పేరుతో కావాలనే ఆంక్షలు సృష్టిస్తున్నారని రైతులు, ఐకాస నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Southern Zonal Council Meet: అమిత్ షా తిరుపతి పర్యటన.. సీఎం జగన్​తో కలిసి శ్రీవారి దర్శనం

అమరావతి ఆవశ్యకతను రాష్ట్రవ్యాప్తంగా తెలియచెప్పేందుకు ఓ మహా సంకల్పానికి రాజధాని రైతులు శ్రీకారం చుట్టిన మహా పాదయాత్ర ఇవాళ పునః ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ప్రకాశం జిల్లా నిడమనూరు గ్రామ పంచాయతీలో 12వ వార్డుకు ఈ నెల 14వ తేదీన ఉపఎన్నిక(by-poll) జరగనుంది. ఫలితంగా పాదయాత్ర జరపరాదని ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారి ఆదేశాలను గౌరవిస్తూ.. పాదయాత్రకు ఐకాస నేతలు విరామం ప్రకటించారు. 12వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లా యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆగింది. కాగా ఇవాళ ఉదయం అక్కడి నుంచే యాత్ర ప్రారంభం కానుంది.

అడుగడుగునా ఘనస్వాగతం..
12వరోజు(శుక్రవారం) ఒంగోలులో బృందావన కళ్యాణ మండపం నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. పోలీసుల పహారా నడుమ యాత్ర కొనసాగింది. రైతులకు.. ప్రజలు అడుగడుగునా పూలతో ఘన స్వాగతం పలికారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రలో ముందుకు సాగారు. రైతుల పాదయాత్రకు స్థానికులే కాకుండా సమీప గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై అమరావతి అనే నినాదాలు, డప్పు శబ్దాలు, కోలాట నృత్యాల మధ్య పాదయాత్ర సందడిగా సాగింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న రైతుల డిమాండ్‌కు ప్రకాశం జిల్లా ప్రజలు మద్దతు పలికారు. పాదయాత్రలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్‌తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ పార్టీ అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

రైతులపై లాఠీఛార్జ్..
ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర(amaravathi farmers padayatra).. గురువారం పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. ఇన్ని కఠిన ఆంక్షలు, నిర్బంధాల్నీ తోసిరాజని పరిసర గ్రామాల నుంచి వేల మంది తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు. అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో బలగాల్ని మోహరించిన పోలీసులు.. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు. చెక్‌పోస్టులు పెట్టి వాహనాల్ని మళ్లించారు. కనిపించిన ప్రతిఒక్కరినీ ఎక్కడికి వెళుతున్నారో అడిగి, పాదయాత్రకు కాదని నమ్మకం కుదిరితేనే పంపించారు.

వందల మంది పోలీసులు లాఠీలు(lotties) పట్టుకుని, పాదయాత్ర ముందు సాగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. వాహనాలపై తిరుగుతూ ప్రజల్ని అడ్డుకున్నారు. పాదయాత్రకు వెళ్లేందుకు వీల్లేదని, ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. హెచ్చరికల్ని కాదని ముందుకు వచ్చినవారిని తోసిపారేశారు. వందల మంది పోలీసులు రోప్‌పార్టీలతో ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు ఎదురుతిరిగి రైతుల దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు. ఒకరి చెయ్యి విరిగింది. నిబంధనలకు లోబడి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రకు కొవిడ్‌ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ పేరుతో కావాలనే ఆంక్షలు సృష్టిస్తున్నారని రైతులు, ఐకాస నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Southern Zonal Council Meet: అమిత్ షా తిరుపతి పర్యటన.. సీఎం జగన్​తో కలిసి శ్రీవారి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.