ETV Bharat / city

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులతో నేడు లోకేశ్ సమావేశం - AP Latest News

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. గురువారం ఉదయం 9 గంటలకు ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. భౌతిక మూల్యాంకనం కోసం రూపొందించిన జవాబు పత్రాలను.. డిజిటల్ పద్ధతిలో చేయడం వల్ల అర్హులు నష్టపోయే ప్రమాదం ఉందనే అంశంపై చర్చించనున్నారు.

Lokesh Nara
Lokesh Nara
author img

By

Published : Jun 9, 2021, 10:55 PM IST

Updated : Jun 10, 2021, 6:29 AM IST

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అభ్యర్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఈ చర్చ ప్రారంభం కానుంది. అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలనే డిమాండ్​ను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు.

డిజిటల్ మూల్యాంకనం అనేక అనుమానాలకు తావిస్తున్నందున.. వాటన్నిటినీ నివృత్తి చేసి సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఇప్పటికే లోకేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. భౌతిక మూల్యాంకనం కోసం రూపొందించిన జవాబు పత్రాలను.. డిజిటల్ పద్ధతిలో చేయడం వల్ల అర్హులు నష్టపోయే ప్రమాదం ఉందనే అంశంపై నేడు చర్చ జరగనుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అభ్యర్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఈ చర్చ ప్రారంభం కానుంది. అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలనే డిమాండ్​ను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు.

డిజిటల్ మూల్యాంకనం అనేక అనుమానాలకు తావిస్తున్నందున.. వాటన్నిటినీ నివృత్తి చేసి సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఇప్పటికే లోకేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. భౌతిక మూల్యాంకనం కోసం రూపొందించిన జవాబు పత్రాలను.. డిజిటల్ పద్ధతిలో చేయడం వల్ల అర్హులు నష్టపోయే ప్రమాదం ఉందనే అంశంపై నేడు చర్చ జరగనుంది.

ఇదీ చదవండి:

2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు గుడ్​న్యూస్

Last Updated : Jun 10, 2021, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.