ETV Bharat / city

పరిశ్రమ స్థాపనలో నైపుణ్య యువతే కీలకం: మంత్రి గౌతం రెడ్డి

author img

By

Published : Feb 24, 2021, 3:47 PM IST

పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం కలిగిన యువతే కీలకమని ఐటీ మంత్రి గౌతంరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో తగిన చర్యలు చేపట్టామన్నారు. స్థానిక యువతకు నైపుణ్యాలు అందించి.. వర్క్‌ ఫోర్స్‌ తయారీపై దృష్టి పెట్టామని వెల్లడించారు.

it minister gowtham reddy
it minister gowtham reddy

ఏ పరిశ్రమ స్థాపించాలన్నా నైపుణ్యం కలిగిన యువత అవసరమని ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి అంశంపై ఆయన సమీక్షించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోని యువత నైపుణ్యంపై ఆరా తీస్తారని చెప్పారు. స్థానిక యువతకు నైపుణ్యాలు అందించి వర్క్‌ ఫోర్స్‌ తయారీపై దృష్టి పెట్టామన్నారు.

ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో మార్పులకు తగ్గట్లు శిక్షణపై దృష్టి సారించామని వివరించారు. శిక్షణ తర్వాత ఎలాంటి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నామనేదే ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అనే చట్టం తెచ్చిందని.. ఏపీఎస్ఎస్డీసీ సహకారంతో ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే దానిపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

ఏ పరిశ్రమ స్థాపించాలన్నా నైపుణ్యం కలిగిన యువత అవసరమని ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి అంశంపై ఆయన సమీక్షించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోని యువత నైపుణ్యంపై ఆరా తీస్తారని చెప్పారు. స్థానిక యువతకు నైపుణ్యాలు అందించి వర్క్‌ ఫోర్స్‌ తయారీపై దృష్టి పెట్టామన్నారు.

ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో మార్పులకు తగ్గట్లు శిక్షణపై దృష్టి సారించామని వివరించారు. శిక్షణ తర్వాత ఎలాంటి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నామనేదే ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అనే చట్టం తెచ్చిందని.. ఏపీఎస్ఎస్డీసీ సహకారంతో ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే దానిపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

మా బసవడి స్పెషల్ మీకు తెలుసా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.