మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన ఆయన పాలనాపరమైన బదిలీలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇవాళ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ప్రాథమికంగా సమావేశం అయ్యారు.
మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు అధికారులు అంకిత భావంతో పని చేయాలని ఇంతియాజ్ చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని.. వాటిని అర్హులకు చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇంతియాజ్ను ముస్లిం మత పెద్దలు సన్మానించారు.
ఇదీ చదవండి: 'బెయిల్ రద్దవుతుందనే భయంతోనే.. దిల్లీకి జగన్ మళ్లీ మళ్లీ..'