T.D.S. చెల్లింపుల వ్యవహారంలో ఐటీశాఖ ఏపీ ట్రెజరీ విభాగానికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయిస్తున్న T.D.S. మొత్తాలను జమ చేయకపోవడంపై ఐటీ శాఖ వివరణ కోరినట్టు సమాచారం. ఏపీలోని ట్రెజరీ విభాగం ఉన్నతాధికారులతో పాటు అన్ని జిల్లాల ట్రెజరీ, సబ్ ట్రెజరీ అధికారులకు లేఖలు పంపినట్టు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా ఉద్యోగుల నుంచి వసూలు చేసిన T.D.S. ఐటీ విభాగానికి జమ చేయకపోవటంపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆలస్యంగా చెల్లిస్తే చట్టప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించినట్లు తెలిసింది.
ఇవి చదవండి: