ETV Bharat / city

పాదయాత్రపై వివరణకు గడువు ఇవ్వండి.. విచారణను వాయిదా వేసిన హైకోర్టు - అమరావతి వార్తలు

Amaravati farmers అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు విచారణ చేపట్టింది. వివరణకు రెండు రోజుల సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో విచారణ ఈనెల 8వ తేదికి వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.

High Court
హైకోర్టు
author img

By

Published : Sep 6, 2022, 5:08 PM IST

Amaravati farmers రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈనెల 12న అమరావతి నుంచి అరసవిల్లి వరకూ పాదయాత్ర చేపట్టినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పాదయాత్రకు అనుమతి కోసం ఇప్పటికే పోలీసులకు దరఖాస్తు చేసినట్లు వివరించారు. అయితే పోలీసుల నుంచి అనుమతి ఇచ్చినట్లుకానీ, తిరస్కరించినట్లు కానీ సమాచారం రాలేదని ధర్మాసనానికి తెలిపారు. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు... పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాది రెండురోజుల సమయం కోరగా తదపరి విచారణను ఈనెల 8వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Amaravati farmers రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈనెల 12న అమరావతి నుంచి అరసవిల్లి వరకూ పాదయాత్ర చేపట్టినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పాదయాత్రకు అనుమతి కోసం ఇప్పటికే పోలీసులకు దరఖాస్తు చేసినట్లు వివరించారు. అయితే పోలీసుల నుంచి అనుమతి ఇచ్చినట్లుకానీ, తిరస్కరించినట్లు కానీ సమాచారం రాలేదని ధర్మాసనానికి తెలిపారు. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు... పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాది రెండురోజుల సమయం కోరగా తదపరి విచారణను ఈనెల 8వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.