ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు... దెబ్బతిన్న పంటలు

author img

By

Published : Sep 16, 2020, 7:25 AM IST

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో సీమ ప్రాంతంలోని ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించిన లెక్కలను వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇవాళ, రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

low pressure
low pressure

తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దెబ్బతిన్న పంటలకు సంబంధించి వ్యవసాయశాఖ బృందాలు లెక్కలు తీస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో సుమారు 4,500 ఎకరాల్లో అరటి, బొప్పాయి, మిరప, టమోటా, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మంగళవారం గరిష్ఠంగా.. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 15.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 14.5, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో 11.6, కృష్ణా జిల్లా పెడనలో 9.8 సెం.మీ వర్షం కురిసింది. అనంతపురం, విజయనగరం, కర్నూలుతో పాటు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వానలు కురిశాయి.

వర్ష సూచన...

మరో పక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో.. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు కురవొచ్చని సూచించారు.

కొండవీటి వాగు పరిధిలో పంట మునక

గుంటూరు జిల్లాలో కొండవీటి వాగుకు మంగళవారం తెల్లవారుజామున తాడికొండ-కంతేరు గ్రామాల మధ్య గండిపడింది. సుమారు వెయ్యి ఎకరాల్లోని మిర్చి, పత్తి, వరి, మినుము, పెసర, తదితర పంటలు మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోకాలి లోతున నీరు ప్రవహించడంతో గండిని పూడ్చడానికి రైతులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తూర్పుగోదావరి జిల్లాలోని 25 మండలాల్లో 130 గ్రామాల్లో 7,910 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. వర్షాలకు కాకినాడలో కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణం, జీజీహెచ్‌లోకి నీరు చేరింది. జీజీహెచ్‌లోని ఓపీకి వచ్చిన బాలింతలు, గర్భిణులు నీటిలోనే అవస్థలు పడుతూ చికిత్స పొందారు. వార్డులో మంచాల కిందకు నీరు చేరడంతో తమ శిశువులతో బాలింతలు, వారితో వచ్చిన బంధువులతో కిక్కిరిసిపోయింది.

శ్రీశైలంలో వరద తగ్గుముఖం

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద తగ్గడంతో మంగళవారం రాత్రికి శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను ఎత్తి 1,11,932 క్యూసెక్కులు, కుడిగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుతు ఉత్పత్తి చేస్తూ 30,896 క్యూసెక్కులను దిగువ ఉన్న నాగార్జునసాగô్కు విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి జలాశయం నీటిమట్టం 884.80 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 214.845 టీఎంసీలుగా నమోదైంది.

దిగువకు 3.57 లక్షల క్యూసెక్కులు విడుదల

కృష్ణా నదికి వరద పోటు మంగళవారం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. బ్యారేజీకి మొత్తం 4.34 లక్షల ఇన్‌ఫ్లో ఉంది. రాత్రి 8 గంటలకు 4.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వరద తీవ్రత తగ్గితే అర్థరాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. బుధవారం ఉదయం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దిగువకు 3.57 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 70 గేట్లు తెరిచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. విజయవాడ నగరం కృష్ణలంక ప్రాంతంలోని పలుచోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. అవనిగడ్డ మండలం పులిగడ్డ-పెనుమూడి వద్ద కృష్ణా నదిలో ఉన్న దిబ్బలపై 1,100 గొర్రెలు చిక్కుకున్నాయి. వీటిలో 300 గొర్రెలను పడవల ద్వారా తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:

రాజధాని భూముల కేసుపై ఏపీ హైకోర్టు స్టే

తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దెబ్బతిన్న పంటలకు సంబంధించి వ్యవసాయశాఖ బృందాలు లెక్కలు తీస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో సుమారు 4,500 ఎకరాల్లో అరటి, బొప్పాయి, మిరప, టమోటా, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మంగళవారం గరిష్ఠంగా.. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 15.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 14.5, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో 11.6, కృష్ణా జిల్లా పెడనలో 9.8 సెం.మీ వర్షం కురిసింది. అనంతపురం, విజయనగరం, కర్నూలుతో పాటు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వానలు కురిశాయి.

వర్ష సూచన...

మరో పక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో.. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు కురవొచ్చని సూచించారు.

కొండవీటి వాగు పరిధిలో పంట మునక

గుంటూరు జిల్లాలో కొండవీటి వాగుకు మంగళవారం తెల్లవారుజామున తాడికొండ-కంతేరు గ్రామాల మధ్య గండిపడింది. సుమారు వెయ్యి ఎకరాల్లోని మిర్చి, పత్తి, వరి, మినుము, పెసర, తదితర పంటలు మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోకాలి లోతున నీరు ప్రవహించడంతో గండిని పూడ్చడానికి రైతులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తూర్పుగోదావరి జిల్లాలోని 25 మండలాల్లో 130 గ్రామాల్లో 7,910 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. వర్షాలకు కాకినాడలో కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణం, జీజీహెచ్‌లోకి నీరు చేరింది. జీజీహెచ్‌లోని ఓపీకి వచ్చిన బాలింతలు, గర్భిణులు నీటిలోనే అవస్థలు పడుతూ చికిత్స పొందారు. వార్డులో మంచాల కిందకు నీరు చేరడంతో తమ శిశువులతో బాలింతలు, వారితో వచ్చిన బంధువులతో కిక్కిరిసిపోయింది.

శ్రీశైలంలో వరద తగ్గుముఖం

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద తగ్గడంతో మంగళవారం రాత్రికి శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను ఎత్తి 1,11,932 క్యూసెక్కులు, కుడిగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుతు ఉత్పత్తి చేస్తూ 30,896 క్యూసెక్కులను దిగువ ఉన్న నాగార్జునసాగô్కు విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి జలాశయం నీటిమట్టం 884.80 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 214.845 టీఎంసీలుగా నమోదైంది.

దిగువకు 3.57 లక్షల క్యూసెక్కులు విడుదల

కృష్ణా నదికి వరద పోటు మంగళవారం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. బ్యారేజీకి మొత్తం 4.34 లక్షల ఇన్‌ఫ్లో ఉంది. రాత్రి 8 గంటలకు 4.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వరద తీవ్రత తగ్గితే అర్థరాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. బుధవారం ఉదయం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దిగువకు 3.57 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 70 గేట్లు తెరిచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. విజయవాడ నగరం కృష్ణలంక ప్రాంతంలోని పలుచోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. అవనిగడ్డ మండలం పులిగడ్డ-పెనుమూడి వద్ద కృష్ణా నదిలో ఉన్న దిబ్బలపై 1,100 గొర్రెలు చిక్కుకున్నాయి. వీటిలో 300 గొర్రెలను పడవల ద్వారా తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:

రాజధాని భూముల కేసుపై ఏపీ హైకోర్టు స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.