తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు మృతి చెందారు. అనారోగ్యంతో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో రత్నాకర్రావు అంత్యక్రియలు జరగనున్నాయి.