కృష్ణా జిల్లా విజయవాడ కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లోని అగ్గిపెట్టెల గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. దుర్ఘటన జరిగిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ఇంజిన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తినష్టంపై ఇంకా స్పష్టత లేదు. షాట్సర్క్యూటే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి